Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండెక్కిన చికెన్ ధరలు - 20 రోజుల్లో రూ.100 పెరుగుదల

Webdunia
శనివారం, 12 మార్చి 2022 (13:53 IST)
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు కొండెక్కాయి. గత 20 రోజుల వ్యవధిలో ఏకంగా రూ.100 మేరకు పెరిగాయి. మున్ముందు మరింతగా పెరిగే అవకాశం ఉన్నాయని చికెన్ వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. 
 
ఒక్క తెలంగాణ రాష్ట్రంలో రోజుకు 10 లక్షల కేజీల చికెన్ విక్రయాలు జరుగుతుంటాయి. ఆదివారం లేదా పండుగ రోజుల్లో ఇది 15 లక్షల కేజీల వరకు ఉంటుంది. అయితే, ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది. 
 
ఫలితంగా గత 20 రోజులుగా చికెన్ విక్రయాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. రోజుకు 2 లక్షల కేజీల వరకు చికెన్ డిమాండ్ కూడా పెరిగింది. దీంతో పాటు కోళ్ళ కొరత ఏర్పడుతుంది. ఈ కారణాలన్నింటి కారణంగా చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. 
 
దీనికితోడు తెలుగు రాష్ట్రాల్లో సూర్యతాపం పెరిగింది. దీంతో ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఫలితంగా కోడి పిల్లలు మృత్యువాతపడుతున్నాయి. దీనికితోడు సోయాచెక్క, మొక్కజొన్న దాణా వంటి ధరలూ పెరిగిపోయాయి. 
 
మరోవైపు నాటుకోడి ధర కేజీలో రూ.400 నుంచి రూ.500కు పెరిగింది. ప్రస్తుతం నాటుకోళ్ళ లభ్యత చాలా తక్కువగా ఉండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments