తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 504, 505 కింద చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో రేవంత్ దోషిగా తేలితే మూడేళ్ళ వరకూ జైలు శిక్ష పడే అవకాశముంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనకు సమన్లు జారీ చేయాల్సిందిగా నిన్న మూడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి చార్జ్ షీట్ దాఖలు చేశారు.
కాగా, కేసీఆర్ను తిట్టిన కేసులో తెలంగాణ టీడీపీ నేత, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై పోలీసులు చార్జీషీట్ తయారు చేశారు. కాగా, మరో కేసులో ఇవాళ ఆయనపై ఐపీసీ సెక్షన్ 504, 505 కింద కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే.
ఈ మేరకు నాంపల్లిలోని నేర న్యాయస్థానంలో చార్జీషీట్ దాఖలు చేశారు. రేవంత్ రెడ్డిని అరెస్టు చేసేందుకు వారెంట్ జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. త్వరలో కేసు విచారణ జరిపి వారెంట్ జారీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.