Webdunia - Bharat's app for daily news and videos

Install App

చలాన్లు రెట్టింపు కావు.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు

Webdunia
బుధవారం, 28 ఆగస్టు 2019 (08:57 IST)
సెప్టెంబర్ 1వ తేదీనుంచి పెండింగ్ లో ఉన్న చలాన్లు రెట్టింపు అవుతాయంటూ సోషల్ మీడియాలో తిరుగుతున్న వార్త ఫేక్ న్యూస్ అని చెప్పారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. అది పూర్తిగా తప్పుడు వార్త అనీ.. పుకార్లను నమ్మొద్దని చెప్పారు.
 
“వాహనదారులకు విజ్ఞప్తి. మీ వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను ఈనెల ఆఖర్లోగా అనగా 31-08-2019లోగా చెల్లించండి. లేనిచో.. 01-09-2019 నాటికి కొత్త చట్టం ప్రకారం సాఫ్ట్ వేర్ అప్ డేషన్ అయిన వెంటనే.. పాత జరిమానాలు అన్నీ ఆటోమేటిక్ గా కొత్త ధరలతో రెట్టింపు చేయబడును- కమిషనర్ ఆఫ్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్ వింగ్, హైదరాబాద్ , తెలంగాణ” అంటూ.. వాట్సప్, ఫేస్ బుక్ లలో తిరుగుతున్న న్యూస్ ను ఎవరూ నమ్మొద్దని.. ఫేక్ న్యూస్ ను షేర్ చేయొద్దని కోరారు.
 
 సెప్టెంబర్ 1వ తేదీనుంచి … ఇప్పటికే చలాన్లు కట్టనివారికి కొత్త నిబంధనల ప్రకారం బిల్లులు మారిపోతాయన్న ప్రచారాన్ని సర్క్యులేట్ చేయొద్దన్నారు. పెండింగ్ చలాన్లు ఉన్నవారికి ఆ బిల్లులు అలాగే ఉంటాయని.. కొత్త చట్టం అమలులోకి వస్తే.. ఆ చట్టం ప్రకారం అప్పటినుంచి చలాన్లు నమోదవుతాయని క్లారిటీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments