Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటుకు నోటు కేసు: మత్తయ్యకు టీఏసీబీ హామీ.. నోటీసులే.. అరెస్ట్ చేయం!

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2016 (10:06 IST)
ఓటుకు నోటు కేసులో విచారణలో హాజరుకావాలంటూ ఈ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న జెరూసలెం మత్తయ్యకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ ఏసీబీ అధికారులు ఓ కీలక అంశాన్ని ప్రస్తావించారు. తాజాగా శుక్రవారం ఈ కేసు ఫైలు బూజు దులిపిన టీ ఏసీబీ, విచారణకు హాజరుకావాలంటూ ఉప్పల్‌లోని మత్తయ్యకు నోటీసులు జారీ చేసింది. 
 
విచారణకు పిలిచి ఎక్కడ అరెస్ట్ చేస్తారోనన్న భయంలో మళ్లీ మత్తయ్య ఏపీ పారిపోవచ్చని భావించిన ఏసీబీ అధికారులు... ఆ నోటీసుల్లో ఓ కీలక అంశాన్ని ప్రస్తావించారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు మిమ్మల్ని అరెస్ట్ చేయబోమని ఏసీబీ మత్తయ్యకు హామీ ఇచ్చింది. అంతేకాక న్యాయవాదితో కలిసి విచారణకు రావచ్చని కూడా ఆయనకు తెలిపింది.
 
ఈ కేసు వెలుగు చూసిన వెంటనే అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు మత్తయ్య ఏపీకి తరలివెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచే మత్తయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకుని తన అరెస్ట్‌ను నిలువరించుకున్నారు. ఆ తర్వాత కాని ఆయన హైదరాబాదులో అడుగుపెట్టలేదు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments