Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టీసీ బస్సులో కోడిపుంజుకు టిక్కెట్ కొట్టిన కండక్టర్.. షాకైన సజ్జనార్

Webdunia
మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (22:52 IST)
ఆర్టీసీ బస్సులో ఎక్కితే టిక్కెట్ తీసుకోవాల్సిందే. లగేజీలతో పాటు చిన్నపిల్లలకు కూడా బస్పులో టికెట్ తీసుకోవాల్సిందే. పిల్లలకు అయితే హాఫ్ టికెట్.. పెద్దవాళ్లకు ఫుల్ టికెట్ అడుగుతారు కండక్టర్లు. తాజాగా ఓ కండక్టర్ కోడిపుంజుకు టికెట్ కొట్టాడు. ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
 
ఇంతకీ కండక్టర్ కోడిపుంజుకు ఎంత ఛార్జీ వసూలు చేశాడో తెలుసా.. అక్షరాలా రూ.30. వివరాల్లోకి వెళితే తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గోదావరిఖని నుంచి కరీంనగర్ వెళ్తోంది. మహమ్మద్ అలీ అనే ప్రయాణికుడు బస్సు ఎక్కాడు. 
 
కరీంనగర్​ వెళ్లేందుకు టికెట్​ తీసుకున్నాడు. అతడి వెంట ఓ కోడిపుంజు కూడా ఉంది. బస్సు సుల్తానాబాద్​ వద్దకు చేరుకున్న సమయంలో కండక్టర్​ తిరుపతికి కోడిపుంజు శబ్దం వినిపించింది. వెంటనే.. కోడికి రూ.30 టికెట్​ కొట్టి అలీ చేతికిచ్చాడు కండక్టర్​.
 
ఆ టికెట్​ చూసిన ప్రయాణికుడు ఒక్కసారిగా షాక్​ అయ్యాడు. అదేంటీ కోడికి టికెట్​ ఏంటి? అని అన్నాడు. ప్రాణంతో ఉండే ప్రతీ జీవికి టికెట్​ తీసుకోవాల్సిందేనని కండక్టర్​ చెప్పడంతో ప్రయాణికుడికి షాక్ తప్పలేదు. చేసేది ఏమిలేక టికెట్​కు చిల్లరతో ఇచ్చేశాడు. 
 
నెటిజన్లు.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ దృష్టికి ట్విట్టర్​ ద్వారా ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఈ ఘటనపై స్పందించిన సజ్జనార్​.. వెంటనే దృష్టి సారిస్తామని సమాధానమిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments