Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడిపుంజుకు బస్సు టిక్కెట్ - ప్రయాణికులే దేవుళ్లు అన్న ఎండీ సజ్జనార్

Webdunia
మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (19:16 IST)
తెలంగాణ ప్రభుత్వ రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఆర్టీసీ బస్సు కండెక్టర్ బస్సులో ఎక్కిన ప్రయాణికులతో పాటు ఓ ప్రయాణికుడు తన వెంట తెచ్చుకున్న కోడిపుంజుకు కూడా ప్రయాణ టిక్కెట్ కొట్టాడు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. దీంతో నెటిజన్లు ఆ కండక్టర్‌తో పాటు టీఎస్ఆర్టీసీపై జోకులు పేల్చుతున్నారు. 
 
అయితే, రాజు అనే నెటిజన్ మాత్రం టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ట్యాగ్ చేస్తూ, కోడిపుంజుకు టిక్కెట్ కొట్టిన కండక్టర్ అంటూ కామెంట్ పోస్ట్ చేశాడు. దీనిపై ఎండీ సజ్జనార్ స్పందించారు. ఈ విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ప్రయాణికులే దేవుళ్లు, వారి ఆదరాభిమానాలే మా సంస్థకు నిధి అని సమాధానిచ్చారు. అలాగే, టీఎస్ఆర్టీసీ కూడా ప్రగతి రథం - ప్రజా సేవా పథం అంటూ ట్వీట్ చేసింది. 
 
గోదావరిఖని బస్టాండు నుంచి మంగళవారం కరీంనగర్‌కు బయలుదేరిన ఓ బస్సులో మహ్మద్ అలీ అనే ప్రయాణికుడు తన వెంట ఓ కోడిపుంజును కూడా తీసుకుని బస్సెక్కాడు. అయితే, ఆ బస్సు కండక్టర్ తిరుపతి కోడిపుంజుకు కూడా టిక్కెట్ కొట్టాడు. దీంతో సదరు వ్యక్తి ఆశ్చర్యానికి గురయ్యాడు. ప్రయాణికుడితో పాటు ప్రాణంతో ఉన్న జీవిని వెంట తీసుకుని వస్తే టిక్కెట్ తీసుకోవాలని బస్ కండక్టర్ సెలవించారు. దీంతో ఆ ప్రయాణికుడు అవాక్కయ్యాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమలో పూర్తిగా మునిగిపోతే తికమక చేస్తుంది : త్రిష

Samantha: సమంతకి సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments