Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కేసీఆర్ పార్టీకి తేరుకోలేని షాకిచ్చిన లోక్‌సభ సచివాలయం

Webdunia
బుధవారం, 1 మార్చి 2023 (14:55 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని భారత రాష్ట్ర సమితికి లోక్‌సభ సచివాలయం తేరుకోలేని షాకిచ్చింది. లోక్‌సభ బీఏసీ నుంచి ఆ పార్టీ గుర్తింపును రద్దు చేసింది. బీఆర్‌ఎస్‌కు లోక్‌సభ సచివాలయం గుర్తింపును ఇవ్వలేదు. బీఆర్ఎస్‌ తరపున బిజినెస్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా ఆ పార్టీకి చెందిన ఎంపీ నామా నాగేశ్వర రావు మాత్రమే ఉన్నారు.

అయితే, బుధవారం జరిగిన లోక్‌సభ బీఏసీకి ఆయన్ను బీఆర్ఎస్ సభ్యుడిగా కూడా కేవలం ఆహ్వానితుడిగానే లోక్‌సభ సచివాలయం ఆహ్వానించింది. నిజానికి ఆరుగురు సభ్యుల కంటే ఎక్కువ మంది లోక్‌సభ సభ్యులు ఉన్న పార్టీకి బీఏసీ సభ్యత్వం ఉంటుంది. అయితే, తెరాసకు తొమ్మిది మంది సభ్యులు ఉన్నప్పటికీ ఆ పార్టీకి బీఏసీ సభ్యత్వాన్ని ఇచ్చేందుకు లోక్‌సభ సచివాలయం నిరాకరించింది.

దీంతో ఆ పార్టీ ఇకపై కేవలం ఆహ్వానిత పార్టీగానే ఉండనుంది. అంటే, లోక్‌సభ సచివాలయం ఆహ్వానిస్తేనే బీఏసీ సమావేశానికి బీఆర్ఎస్ సభ్యుడు హాజరుకావాల్సి వుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#TheyCallHimOG - షూటింగ్‌లతో పవన్ బిజీ బిజీ

రెండు భాగాలుగా మహేశ్ బాబు - రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్ మూవీ?

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments