ఇంట్లోకి ప్రవేశించిన నల్లత్రాచు... చిన్నారులు మాత్రమే వుండటంతో..

Webdunia
శుక్రవారం, 25 డిశెంబరు 2020 (11:42 IST)
అర్ధరాత్రి వేళ ఓ నల్లత్రాచు కలకలం రేపింది. పాము ఇంట్లో దూరిన సమయంలో కేవలం చిన్నారులు మాత్రమే ఉండటంతో వారు వారు భయంతో వణికిపోయారు. ఈ ఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కాలనీలో చోటుచేసుకుంది. వివరాలు.. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి ఎయిర్‌పోర్ట్ కాలనీలో నివాసం ఉంటే అక్బర్ అనే వ్యక్తి ఇంట్లోకి అర్ధరాత్రి వేళ నల్లత్రాచు పాము మెల్లగా దూరింది. ఇంట్లోకి దూరి హల్ చల్ చేసింది.

అయితే పాము ఇంట్లోకి వచ్చిన సమయంలో కేవలం చిన్న పిల్లలు మాత్రమే ఇంట్లో ఉన్నారు. దీంతో వారు పామును గమనించి గజగజ వణికిపోయారు. భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. వారి కేకలు విన్న కాలనీవాసులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు.
 
నల్లత్రాచును చూసేందుకు పెద్ద సంఖ్యలో అక్బర్ నివాసం వద్దకు చేరుకున్నారు. జనాన్ని చూసిన పాము కదలకుండా అక్కడే నిలబడి పోయింది. కాసేపటికి అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో అక్కడి వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల ఖమ్మంలో బైక్‌లో నుంచి బయటపడ్డ పాము.. కొద్ది రోజుల కిందట ఖమ్మం జిల్లాలో ఓ వ్యక్తి బైక్‌లో పాము కనిపించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tharun Bhascker: గాయపడ్డ సింహం గా తరుణ్ భాస్కర్ ఏమి చేశాడు !

నాగార్జున వాయిస్ ఓవర్ తో అనిష్ చిత్రం ఇట్లు అర్జున

టెలివిజన్‌ టీఆర్‌పీతో రికార్డులను బద్దలు కొట్టిన తేజ సజ్జా మిరాయ్

Yash: టాక్సిక్‌ తెలుగు రాష్ట్రాల హ‌క్కుల‌ను 120 కోట్ల‌కు సొంతం చేసుకున్న దిల్ రాజు

Unni Mukundan: హైదరాబాద్ లో షెడ్యూల్ పూర్తి చేసుకున్న మోదీ బయోపిక్ మా వందే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యాధునిక ఆరోగ్య పరిష్కారాలపై ఏవిపిఎన్ హెల్త్ ఇంపాక్ట్ లీడర్‌షిప్ ఫోరం 2026

ఉప్పు అధికంగా తీసుకుంటే 7 సమస్యలు, ఏంటవి?

ఊపిరితిత్తుల క్యాన్సర్ చుట్టూ ఉన్న అతిపెద్ద అపోహలు బట్టబయలు

Dry Fish : పురుషులకు మేలు చేసే ఎండు చేపలు.. మధ్యాహ్నం భోజనంలో భాగం చేస్తే?

కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments