Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లోకి ప్రవేశించిన నల్లత్రాచు... చిన్నారులు మాత్రమే వుండటంతో..

Webdunia
శుక్రవారం, 25 డిశెంబరు 2020 (11:42 IST)
అర్ధరాత్రి వేళ ఓ నల్లత్రాచు కలకలం రేపింది. పాము ఇంట్లో దూరిన సమయంలో కేవలం చిన్నారులు మాత్రమే ఉండటంతో వారు వారు భయంతో వణికిపోయారు. ఈ ఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కాలనీలో చోటుచేసుకుంది. వివరాలు.. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి ఎయిర్‌పోర్ట్ కాలనీలో నివాసం ఉంటే అక్బర్ అనే వ్యక్తి ఇంట్లోకి అర్ధరాత్రి వేళ నల్లత్రాచు పాము మెల్లగా దూరింది. ఇంట్లోకి దూరి హల్ చల్ చేసింది.

అయితే పాము ఇంట్లోకి వచ్చిన సమయంలో కేవలం చిన్న పిల్లలు మాత్రమే ఇంట్లో ఉన్నారు. దీంతో వారు పామును గమనించి గజగజ వణికిపోయారు. భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. వారి కేకలు విన్న కాలనీవాసులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు.
 
నల్లత్రాచును చూసేందుకు పెద్ద సంఖ్యలో అక్బర్ నివాసం వద్దకు చేరుకున్నారు. జనాన్ని చూసిన పాము కదలకుండా అక్కడే నిలబడి పోయింది. కాసేపటికి అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో అక్కడి వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల ఖమ్మంలో బైక్‌లో నుంచి బయటపడ్డ పాము.. కొద్ది రోజుల కిందట ఖమ్మం జిల్లాలో ఓ వ్యక్తి బైక్‌లో పాము కనిపించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments