తెరాస ఎమ్మెల్యేలు మగతనం లేనోళ్లా? ఎవరన్నారు?

తెరాస ఎమ్మెల్యేలు మగతనం లేనోళ్లా.. ఈ సందేహం భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌కు ఉత్పన్నమైంది. తాజాగా జరిగిన ఓ సమావేశంలో రాంమాధవ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలన సాగుతుందని

Webdunia
శుక్రవారం, 6 జులై 2018 (16:34 IST)
తెరాస ఎమ్మెల్యేలు మగతనం లేనోళ్లా.. ఈ సందేహం భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌కు ఉత్పన్నమైంది. తాజాగా జరిగిన ఓ సమావేశంలో రాంమాధవ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలన సాగుతుందని మండిపడ్డారు. ముఖ్యంగా, చిన్నారులకు కూడా రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. ఓ చిన్నారికి తెరాస ఎమ్మెల్యేలు ఫోన్ చేసి బెదిరించే స్థాయికి దిగజారారని, అంటే తెరాస ఎమ్మెల్యేలు మగతనం లేనోళ్లా అంటూ మండిపడ్డారు.
 
ఈ వ్యాఖ్యలపై ఇటు తెరాస, అటు కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఫలితంగా తెరాస, బీజేపీ నేతల మధ్య మాటలయుద్ధం సాగుతోంది. బీజేపీ ఎమ్మెల్యేల మగతనం ఏపాటిదో గతంలో జరిగిన ఎన్నికల్లోనే తేలిపోయిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జీవన్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రాంమాధవ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
 
బీజేపీ నేత రాంమాధవ్ సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని జీవన్‌రెడ్డి విమర్శించారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల మగతనం గురించి మాట్లాడటాన్ని ఖండిస్తున్నామని అన్నారు. సంఘ్‌లో పనిచేశానని చెప్పుకునే రాంమాధవ్ మాట్లాడాల్సిన భాష ఇదేనా? అంటూ ఎమ్మెల్యే ప్రశ్నించారు. తెలంగాణలో కమలం పువ్వు ఎప్పుడో వాడిపోయిందని జీవన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. అలాగే, 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments