Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనారిటీల రిజ‌ర్వేష‌న్ల‌ను ర‌ద్దు చేస్తాం.. కేసీఆర్‌ను దించేందుకు బండి చాలు..!

Webdunia
శనివారం, 14 మే 2022 (22:28 IST)
తెలంగాణ‌లో బీజేపీ అధికారంలోకి వ‌చ్చాక రాష్ట్రంలో మైనారిటీల రిజ‌ర్వేష‌న్ల‌ను ర‌ద్దు చేస్తామ‌ని బీజేపీ అగ్రనేత‌, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. మైనారిటీ రిజ‌ర్వేష‌న్ల‌ను ర‌ద్దు చేసి... ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు పెంచుతామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.
 
బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడి హోదాలో ప్ర‌జా సంగ్రామ యాత్ర పేరిట పాద‌యాత్ర చేసిన బండి సంజయ్ త‌న యాత్ర‌ను శ‌నివారం ముగించారు. దీనిని పురస్కరించుకుని, రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ‌లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌కు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.
 
అలాగే పనిలో పనిగా తెలంగాణలోని కేసీఆర్ సర్కారుపై నిప్పులు చెరిగారు. కేసీఆర్‌ను గ‌ద్దె దించేందుకు బండి సంజ‌య్ ఒక్క‌డే చాల‌ని కూడా అమిత్ షా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 
 
తెలంగాణ‌లో వార‌స‌త్వ రాజ‌కీయాలు పరాకాష్ఠకు చేరాయ‌ని అమిత్ షా ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామ‌కాల‌ను సాధిస్తామ‌ని హామీలిచ్చి అధికారంలోకి వ‌చ్చిన కేసీఆర్‌... ఆ హామీల‌ను తుంగ‌లో తొక్కార‌ని విమ‌ర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments