Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవి కాలం వస్తోంది.. ఎండలు మండిపోతాయ్... బీరు ఉత్పత్తి పెంచండి : అబ్కారీ శాఖ

Webdunia
ఆదివారం, 7 ఫిబ్రవరి 2016 (12:56 IST)
హైదరాబాద్ నగరంలో అపుడే ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే పగటి పూట రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర అబ్కారీ (ఎక్సైజ్) శాఖ అప్రమత్తమైంది. వేసవి కాలంలో బీరు ఉత్పత్తి ఒక్కసీసా కూడా తగ్గడానికి వీలులేదనీ, వీలుంటే అధికంగానే ఉత్పత్తి చేయాలంటూ బ్రూవరీల యాజమాన్యాలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. 
 
ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌, తెలంగాణ స్టేట్‌ బేవరేజెస్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆర్‌వీ చంద్రవదన బీరు ఉత్పత్తి చేసే బ్రూవరీల యజమానులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు తెలంగాణ చరిత్రలోనే ఎక్కువ ఎండలు ఉండే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిందని ఆయన గుర్తు చేశారు. అందువల్ల బీరు అమ్మకాలు 20 శాతం పెరుగుతాయని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. అందువల్ల బీరు ఉత్పత్తి ఏమాత్రం తగ్గకుండా, అదనంగా ఉత్పత్తి చేయాలంటూ ఆయన కోరారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments