Webdunia - Bharat's app for daily news and videos

Install App

హుజురాబాద్ బై పోల్ : ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం

Webdunia
శుక్రవారం, 15 అక్టోబరు 2021 (09:10 IST)
తెలంగాణ రాష్ట్రంలోని హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరుగనుంది. దీంతో ఆ రోజు రాత్రి 7.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించకుండా కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఈ మేరకు కరీంనగర్ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. 
 
ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేసినట్టు వెల్లడించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రచురించరాదని, ఇతర మాధ్యమాల్లోనూ ప్రచారం చేయకూడదని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొందన్నారు. ఆదేశాలు అతిక్రమించచి ఎగ్జిట్ పోల్స్ నిర్వహించినా, మీడియాలో ప్రచురించినా శిక్ష తప్పదని  కర్ణన్ హెచ్చరించారు.
 
కాగా, తెరాస సీనియర్ నేతగాను, మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ఆ పార్టీతో పాటు.. మంత్రిపదవికి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈయన బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments