యాదాద్రిలో బాలయ్య : సీఎం కేసీఆర్‌పై వరాల జల్లు

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (13:42 IST)
అఖండ గెలుపుతో నందమూరి హీరో బాలకృష్ణ ఫుల్ స్వింగ్‌లో వున్నారు. తాజాగా ఆయన "అఖండ" టీంతో కలిసి తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిని దర్శించారు. అంతేకాదు ఆయన యాదాద్రి విషయమై సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
 
ఈ సందర్భంగా యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన బాలకృష్ణ మాట్లాడుతూ.. "సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం అద్భుతంగా ఉంది. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే అద్భుతమైన దేవాలయం యాదాద్రి. ఇక్కడ పరిసరాలను కలుషితం చేయకుండా చేయాలి. 
 
అఖండ సినిమా సక్సెస్‌లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నాం. అందులో భాగంగానే యాదాద్రి దర్శనానికి వచ్చాము. యాదాద్రి ఒక అద్భుతం హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరికి ఉంది.." అంటూ ముఖ్యమంత్రిని ప్రశంసించారు. 
 
కాగా అఖండ టీమ్ ఇటీవల తిరుపతి, విజయవాడ వెళ్ళిన బాలయ్య సోమవారం యాదాద్రి నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బాలయ్యకు దేవస్థానం అధికారులు వేదాశీర్వచనం అందజేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. బాలయ్య వెంట దర్శకుడు బోయపాటి శ్రీను, దేవరకద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వరెడ్డి తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments