Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో బద్వేల్ వైద్యుడు ఆత్మహత్య - సెలైన్‌లో విషం...

Webdunia
ఆదివారం, 12 డిశెంబరు 2021 (08:38 IST)
హైదరాబాద్ నగరంలో మరో దారుణం జరిగింది. ఆంధ్రప్రదేశ్, కడప జిల్లా బద్వేల్‌కు చెందిన వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సెలైన్‌లో విషం కలిపి, దాన్ని తన శరీరంలోకి ఎక్కించుకున్నారు. దీంతో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కడప జిల్లా బద్వేలు పట్టణానికి చెందిన రాజ్‌కుమార్ (29) అనే వైద్యుడు హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేటలోని శ్యామ్ కరణ్ అనే ప్రైవేటు ఆస్పత్రిలో డాక్టర్‌గా పని చేస్తున్నారు. ఈయన బీకేగూడలో అద్దెకు ఉంటున్నారు. అయితే, శుక్రవారం రాత్రి తన స్నేహితులకు ఫోన్ చేసి తన మనసేం బాగాలేదని చెప్పాడు.
 
ఆ తర్వాత వైద్యుడికి ఫోన్ చేసినా ఆయన స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆ స్నేహితుడు మరో వైద్యుడికి సమాచారం అందించారు. ఆ వెంటనే రాజ్‌కుమార్ గదికి వచ్చి చూడగా, ఆయన చేతికి సెలైన్‌తో అపస్మారక స్థితిలో కనిపించారు. 
 
ఆ వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. రాజ్‌కుమార్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments