అసదుద్దీన్ ఉదార స్వభావం... అలా చేసి పూజారి ప్రాణాలు రక్షించారు..

Webdunia
శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (09:00 IST)
హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీని పక్కా హిందూ ద్వేషిగా చాలా మంది భావిస్తుంటారు. కానీ, ఆయనలో చాలా ఉదారస్వభావం ఉందని మరోమారు నిరూపించారు. కరోనా వైరస్ బారినపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ హిందూ ఆలయ పూజారికి ఆస్పత్రిలో ఓ పడక ఇప్పించి అందరి మనస్సులను గెలుచుకున్నారు. 
 
తాజా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిసీలిస్తే, హైదరాబాద్ పాతబస్తీలోని ఓ ఆలయం ఉంది. ఇక్కడ 75 ఏళ్ల పూజారి పనిచేస్తున్నారు. ఈయనకు గత శనివారం కరోనా వైరస్ సోకింది. 
 
అప్పటి నుంచి ఆయన ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ క్రమంలో గురువారం కొంత అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆయనను ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించే ప్రయత్నం చేశారు.
 
అయితే, ఎక్కడా బెడ్స్ అందుబాటులో లేకపోవడంతో వారిలో ఆందోళన మరింత పెరిగింది. ఈ క్రమంలో స్థానిక మజ్లిస్ నేత సాయంతో అసదుద్దీన్‌కు పరిస్థితి వివరించారు. ఆ వెంటనే స్పందించిన అసద్ శాలిబండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి పూజారికి బెడ్ ఇప్పించి ఉదారత చాటుకున్నారు. దీంతో బాధిత కుటుంబసభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janviswaroop: మహేష్ బాబు మేనకోడలు జాన్విస్వరూప్ నటిగా ఎంట్రీ సిద్ధం

Naveen Chandra: అప్పుడు అరవింద సమేత - ఇప్పుడు మాస్ జాతర : నవీన్ చంద్ర

Suriya: రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లా వినోదాన్ని పంచగల హీరో రవితేజ: సూర్య

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments