Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ ఓ అంటురోగం.. అంటుకుంటే వదలదు : మంత్రి పువ్వాడ

Webdunia
సోమవారం, 11 జనవరి 2021 (08:43 IST)
భారతీయ జనతా పార్టీపై తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శలు చేశారు. బీజేపీ ఓ అంటు రోగం వంటిందన్నారు. అది అంటుకుంటే పోదన్నారు. అందువల్ల మంచి రోగ నిరోధక శక్తి ఉన్న ఖమ్మం ప్రజలకు ఇది అంటుకోదు. బిడ్డా బండి సంజయ్‌ 2023లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాపై, మా మమతా మెడికల్‌ కళాశాలపై విచారణ జరిపిస్తా అని మాటలు పేలావు. ఇప్పుడు కేంద్రంలో నీ పార్టీ అధికారంలో ఉంది. దమ్ముంటే నాపై విచారణ చేయించు.. నేను సిద్ధంగా ఉన్నాను అంటూ మంత్రి పువ్వాడ సవాల్ విసిరారు. 
 
ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ నాలుగు ఓట్లు, నాలుగు సీట్ల కోసం చేసే వ్యక్తిగత దూషణలను నమ్మేస్థితిలో ఖమ్మం ప్రజలు లేరని స్పష్టం చేశారు. తన కుటుంబం గురించి ఖమ్మం ప్రజలకు తెలుసని, 22ఏళ్ల క్రితమే మమతా ఆసుపత్రి పెట్టి లక్షలాది మందికి వైద్యం అందించామని తెలిపారు. 
 
మాజీ ప్రధాని వాజ్‌పేయి ప్రభుత్వంలోనే మమతా కాలేజీకి అనుమతి వచ్చిందన్నారు. ‘వ్యాక్సిన్‌ నాకు ఇవ్వడం కాదు.. ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికల్లో నా వ్యాక్సిన్‌ ఎలా ఉంటుందో నీకు తెలియజేస్తా బిడ్డా’ అని సంజయ్‌ను ఉద్దేశించి అన్నారు. 
 
రాజకీయ టూరిస్టుల మాటలను ఖమ్మం ప్రజలు నమ్మబోరని స్పష్టం చేశారు. మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ సమీకృత మార్కెట్లతో రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలు, మాంసాహారం లభిస్తుందని, రైతులకు గిట్టుబాటు ధరలు లభిస్తాయన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments