Webdunia - Bharat's app for daily news and videos

Install App

మత్తయ్య సోదరుడిపై టీ పోలీసుల దాడి.. ఆధారాలు సేకరించిన ఏపీ పోలీసులు

Webdunia
సోమవారం, 6 జులై 2015 (08:49 IST)
ఓటుకు నోటు కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న జెరూసలెం మత్తయ్య సోదరుడు ప్రభుదాస్‌ను కొట్టింది ఎవరో తెలిసిపోయింది. కేసులో మత్తయ్యను భయభ్రాంతులకు గురిచేసేక్రమంలో తెలంగాణ పోలీసులే ప్రభుదాస్‌‍ను కొట్టినట్టు ఏపీ సీఐడీ పోలీసులు ఆధారాలు సేకరించారు. మత్తయ్య కుటుంబ సభ్యులను కూడా భయభ్రాంతులకు గురిచేసేచర్యల్లో భాగంగానే ఈ భౌతికదాడులకు దిగినట్టు తేల్చేశారు. 
 
అంతేకాకుండా, ప్రభుదాస్‌తో పాటు ఆయన భార్యకు కూడా తెలంగాణ పోలీసులు పలుమార్లు ఫోన్లు చేసి బెదిరించిన విషయంపై కూడా పక్కా ఆధారాలు లభ్యమైనట్టు సీఐడీ పోలీసులు చెపుతున్నారు. ఈ బెదిరింపులకు తెలంగాణ రాష్ట్ర పోలీసులతో పాటు అధికార తెరాస పార్టీ నేతలు కూడా పాల్పడినట్టు గుర్తించారు.
 
మత్తయ్య కుటుంబ సభ్యుల మొబైల్ కాల్‌డేటాను నిశితంగా పరిశీలించిన సీఐడీ అధికారులకు పలువురు టీఆర్ఎస్ నేతల ఫోన్ నెంబర్లను కూడా గుర్తించారు. దీనికి సంబంధించి మరింత పక్కాగా ఆధారాలు సేకరించి, ఆ తర్వాత ముందడుగు వేయాలని ఏపీ సీఐడీ భావిస్తోంది. 

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments