Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ వాహనాలపై ఎంట్రీ ట్యాక్స్ వద్దు.. కేసీఆర్ అర్థం చేసుకోండి: జగన్

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2015 (11:26 IST)
ఏపీ వాహనాలపై ఎంట్రీ ట్యాక్స్‌ను ఉపసంహరించుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కోరుతున్నానని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ తెలిపారు. ఢిల్లీలో జైట్లీతో సమావేశం అనంతరం మాట్లాడుతూ కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలే ఎంట్రీ ట్యాక్స్ వసూలు చేయడం లేదని... అలాంటప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇలాంటివి ఉండరాదని చెప్పారు. 
 
ఈ విషయాన్ని కేసీఆర్ అర్థం చేసుకోవాలని అన్నారు. ఒకే భాష మాట్లాడుతున్న మనం, రెండు రాష్ట్రాలుగా విడిపోయినా కలిసే ఉండాలని, అభివృద్ధి పథంలో పయనించాలని జగన్ అభిలషించారు. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలని తెలిపారు. రెండు రాష్ట్రాలు కూడా ఒక రాష్ట్రం నుంచి మరొకటి సంపాదించాలనే విధంగా ఆలోచించకూడదని చెప్పారు. ఏపీ వాహనాలపై ఈ అర్ధరాత్రి నుంచి ఎంట్రీ ట్యాక్స్ వసూలు చేయాలని టీఎస్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ అర్ధరాత్రి నుంచి అది అమల్లోకి రానుంది.

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

Show comments