Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమిత్ షా తెలంగాణ టీ.కాంగ్రెస్ ఆకర్ష్... కాంగ్రెస్ ఖాళీ? తెలంగాణకు విస్తరణ నాయకులు

కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో లేకుండా చేయడమే లక్ష్యంగా భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా యాక్షన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎలాగైతే భాజపాకు బంపర్ మెజారిటీ సాధించుకున్నామో అ

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2017 (19:58 IST)
కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో లేకుండా చేయడమే లక్ష్యంగా భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా యాక్షన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎలాగైతే భాజపాకు బంపర్ మెజారిటీ సాధించుకున్నామో అలాగే తెలంగాణలోనూ రాబట్టాలని అమిత్ షా తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీని తెలంగాణ రాష్ట్రంలో మూలమూలన విస్తరించేందుకు విస్తరణ నాయకులను అమిత్ షా రంగంలోకి దింపారని వార్తలు వస్తున్నాయి.
 
మరోవైపు అమిత్ షా తెలంగాణలో పర్యటనలు చేసందుకు ప్రణాళికలు రూపొందించుకున్నారు. తెలంగాణ రావడానికి ప్రధాన కారణం తామేనని ప్రతిచోటా చెబుతూనే, కేంద్రంలో భాజపా ప్రభుత్వం వున్నది కనుక తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే తమ పార్టీకి ఓట్లు వేయాలని ప్రజలను అడుగనున్నారు. మరోవైపు పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆ రాష్ట్రాన్ని తీసుకువచ్చిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇక్కడ రోజురోజుకీ దిగజారుతోంది. దీన్నే అమిత్ షా తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
 
ఇందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు సీనియర్ నాయకులను పార్టీలోకి ఆహ్వానించాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన జాబితా కూడా ఆయన వద్ద వున్నట్లు సమాచారం. ఇదే కనుక నిజమైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరింత గడ్డు పరిస్థితి ఎదురుకావచ్చు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments