Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో కలిసి ఎయిడ్స్ సోకిన భర్తను హత్య చేసిన ఇల్లాలు

Webdunia
గురువారం, 15 నవంబరు 2018 (12:53 IST)
ఎయిడ్స్ వ్యాధి ఉన్న భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసింది ఓ ఇల్లాలు. రాచకొండ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం రాజమండ్రికి చెందిన తోట దుర్గారావుకు  భార్యాపిల్లలు ఉన్నా అదే ప్రాంతానికి చెందిన లావణ్యను రెండో పెళ్లి చేసుకుని కాకినాడకు దగ్గరలో కాపురం పెట్టారు. దుర్గారావుకు హెచ్‌ఐవీ సోకిందని తెలిసుకున్న లావణ్య, తన బంధువైన రామకృష్ణతో పరిచయం పెంచుకుని వివాహేతర సంబంధం కొనసాగించింది.
 
అయితే రామకృష్ణ బతుకుదెరువు కోసం హైదరాబాద్ నేరెడ్‌మెట్‌కు కుటుంబంతో సహా వచ్చి ఓ సంస్థలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 2018 సెప్టెంబరులో దుర్గారావు, లావణ్య దంపతులు సైతం నగరానికి రాగా రామకృష్ణ వారికి అద్దె ఇల్లు, దుర్గారావుకు పని ఇప్పించి లావణ్యతో  వివాహేతర బంధాన్ని కొనసాగించాడు. అనుకోకుండా ఒక రోజు లావణ్య-రామకృష్ణలు ఒకే గదిలో దుర్గారావుకు  కంటపడటంతో గొడవపడ్డాడు దుర్గారావు. దీంతో లావణ్య చేతికి అందిన ఇనుప రాడ్డుతో భర్త తలపై కొట్టింది. 
 
వెంటనే ప్రియుడితో కలిసి చున్నీతో భర్త మెడకు ఉరి బిగించి హత్య చేసింది. మరుసటిరోజు రామకృష్ణ ఓ వ్యాను తీసుకొచ్చి శవాన్ని కీసర హైవేలో చెట్ల పొదల్లో పడేసి వెళ్లిపోయారు. లావణ్య పిల్లలను తీసుకుని కాకినాడకు వెళ్లిపోయింది. ఈ నెల 2న స్థానికులు ఇచ్చిన సమాచారంతో సీసీ ఫుటేజీలు పరిశీలించిన పోలీసులు రామకృష్ణను నిలదీయడంతో బండారం బట్టబయలైంది. దీంతో నిందితునితో పాటు లావణ్యను సైతం పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments