Webdunia - Bharat's app for daily news and videos

Install App

చల్లని రాత్రులు ఇక లేవు.. తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

Webdunia
మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (10:35 IST)
కొన్ని చల్లని రాత్రుల తరువాత, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కనీస ఉష్ణోగ్రత ఆదివారం పెరిగింది. హైదరాబాద్‌‌లో సోమవారం తెల్లవారుజామున సగటు కనిష్ట ఉష్ణోగ్రత 16.8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇది మునుపటి రోజు కంటే కనీసం రెండు డిగ్రీలు ఎక్కువ.
 
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం (టిఎస్‌డిపిఎస్) అంచనా ప్రకారం, రాబోయే ఐదు రోజుల పాటు నగరం, పొరుగు ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయి. హైదరాబాద్‌లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రత వరుసగా 31 డిగ్రీల సెల్సియస్ మరియు 16 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని భావిస్తున్నారు. పటాన్ చెరు, సికింద్రాబాదు, బేగంపేట వంటి కొన్ని ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రత ఈ వారం మూడు నుండి ఐదు డిగ్రీలు పెరగవచ్చు.
 
ఇదిలా ఉండగా, నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం, ములుగులోని కొన్ని ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం వరకు 4 మి.మీ వరకు వర్షపాతం నమోదైంది. రాబోయే రెండు రోజుల్లో చాలా జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రత రెండు నుండి నాలుగు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

మంగ్లీ డ్రగ్ పార్టీలో మేం లేవంటున్న రచ్చ రవి, దివి వాద్య, కాసర్ల శ్యామ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments