Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాయర్ దంపతుల హత్య : పుట్టా మధు అరెస్టు.. హత్యకు ముందు రూ.2 కోట్లు

Webdunia
ఆదివారం, 9 మే 2021 (15:25 IST)
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన లాయర్ వామనరావు దంపతుల హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో పెద్దపల్లి జెడ్పీ ఛైర్మన్ పుట్టా మధును పోలీసులు అరెస్టు చేశారు. ఆయన వద్ద గత రెండు రోజులుగా విచారణ జరుపుతున్నారు. 
 
అలాగే, ఈ కేసు విచారణను వేగవంతం చేసిన పోలీసులు.. పుట్టా మధు మేనల్లుడు బిట్టు శ్రీనుకు కారు సమకూర్చడం.. లాయర్ హత్యకు ముందు రూ.2 కోట్లు ఎందుకు డ్రా చేశారనే కోణంలో విచారిస్తున్నారు. ఆ సొమ్ము ఎవరికి ఇచ్చారనే దానిపై ఆరా తీస్తున్నారు. 
 
మరో నిందితుడు కుంటా శ్రీను నిర్మిస్తున్న ఇల్లుకు ఎవరు డబ్బులు ఇచ్చారనే దానిపైన దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి పుట్టా మధును మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చే అవకాశం ఉంది. ఇక వామన్ రావు హత్యకేసులో ఓ మాజీ మంత్రి పాత్ర ఉందని సంచలన ఆరోపణలు చేశారు. పుట్టా మధుకు ఆ మంత్రి పూర్తిగా సహకరించారనే ప్రచారు జోరుగా సాగుతోంది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments