Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేషన్‌ కార్డు దారులకు తపాలాశాఖ సేవలు..

Webdunia
బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (08:24 IST)
తెలంగాణ రాష్ట్రంలోని రేషన్‌ కార్డు దారులకు తపాలాశాఖ సేవలందించనుంది. ఆధార్‌తో ఐరిస్‌, ఫోన్‌ నంబర్‌ అనుసంధాన సేవలు పొందవచ్చని తపాలాశాఖ పేర్కొంది. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 124 ఆధార్‌ కేంద్రాలు, 15 మొబైల్‌ కిట్ల ద్వారా సేవలందించనున్నట్లు తెలంగాణ తపాలా సర్కిల్‌ హైదరాబాద్‌ రీజియన్‌ తెలిపింది. 
 
ఆధార్‌ నంబర్‌ అప్‌డేషన్‌కు రూ.50, ఐరిస్‌కు రూ.100, రెండింటికీ రూ.100 ఛార్జీ తీసుకోనున్నట్లు పేర్కొంది. మొన్నటి వరకు రేషన్‌ సరుకుల పంపిణీలో బయోమెట్రిక్‌ (వేలిముద్ర) తీసుకునే విధానం అమలులో ఉండేది. కరోనా మహమ్మారి నేపథ్యంలో వేలిముద్రకు బదులుగా ఓటీపీ లేదా ఐరిస్‌ ద్వారా సరుకుల పంపిణీ ఈ నెల 1న మొదలైంది. 
 
అయితే ఆధార్‌ సంఖ్యతో మొబైల్‌ నంబర్‌ అనుసంధానించి ఉంటేనే ఓటీపీ వస్తుంది. చాలామంది ఆధార్‌కు మొబైల్‌ నంబర్‌ లింక్‌ లేకపోవడంతో ఈ తరహా సేవలందించడంపై తపాలాశాఖ దృష్టి సారించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments