Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరీరంపై దుస్తులు లేవు, ముఖం ఛిద్రం, బ్రిడ్జి కింద మహిళ శవం

Webdunia
బుధవారం, 18 మార్చి 2020 (17:22 IST)
సంచలనం సృష్టించిన దిశ దారుణ ఘటన మరువక ముందే అలాంటి దారుణమే మరొకటి చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం పరిధిలోని తంగడపల్లి బ్రిడ్జి కింద గుర్తు తెలియని మహిళ మృతదేహం పడి వుండటం కలకలం రేపింది. మృతురాలి శరీరం పైన దుస్తులు లేవు, ఆమె ముఖం గుర్తించకుండా వుండేందుకు దుండగులు బండరాయితో మోదారు. దీంతో ఛిద్రమైన స్థితిలో ముఖం వున్నది. ఆమె చేతికి బంగారు గాజులు, మెడలో బంగారు చైన్ వుంది. 
 
మహిళపై గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసి ఇక్కడకి తీసుకుని వచ్చి పడవేసి వుండివుంటారని పోలీసులు ప్రాధమిక నిర్థారణకు వచ్చారు. నిందితులకు సంబంధించిన ఎలాంటి క్లూ లభ్యం కాలేదు. మృతురాలిని వంతెన కిందికి తాడు సాయంతో కిందికి దించారు. ఆ తాడు మాత్రమే శవానికి కొంతదూరంలో పడి వుంది. 
 
మహిళ హత్య మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగినట్లుగా భావిస్తున్నారు. కాగా పోలీసులు మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టమ్ రిపోర్టులో మరిన్ని విషయాలు వెలుగుచూసే అవకాశం వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments