Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో ప్రతీ స్కీం వెనుక ఓ స్కాం: లక్ష్మణ్

Webdunia
శనివారం, 17 ఆగస్టు 2019 (20:21 IST)
రాష్ట్రంలో  ప్రతి  స్కీం  వెనుక…  ఓ  స్కాం  ఉందని  విమర్శించారు  బీజేపీ  రాష్ట్ర  అధ్యక్షుడు లక్ష్మణ్.  రెండోసారి  అధికారంలోకి  వచ్చాక  కేసీఆర్  పాలనను గాలికొదిలేసారని  మండిపడ్డారు.  రాష్ట్రంలోని  ఏ పథకానికి  సరైన  నిధులివ్వటం  లేదన్నారు.  బంగారు  తెలంగాణ  పేరుతో  రాష్ట్రాన్ని  అప్పుల తెలంగాణగా  మార్చారని  ఆగ్రహం  వ్యక్తం  చేశారు  లక్ష్మణ్.
 
కాళేశ్వరాన్ని మానస పుత్రికగా చెప్పుకొనే కేసీఆర్ రూ.30వేల కోట్ల ప్రాజెక్టును రూ. లక్ష కోట్లకు పెంచి 6 శాతం కమీషన్ దండుకున్నారన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకంలో కమీషన్ తీసుకుంటున్నారన్న లక్ష్మణ్.. చంద్రబాబును బూచిగా చూపెట్టి అధికారంలోకి వచ్చి ప్రజా సంక్షేమాన్ని ఆటకెక్కించారని సీరియస్ అయ్యారు.
 
రూ.500 కోట్లు వృథా చేసి అసెంబ్లీ కడతామంటూ చెబుతున్న కేసీఆర్‌.. ఆరోగ్యశ్రీ బకాయిలు మాత్రం చెల్లించట్లేదన్నారు. బస్తీల్లో పేదలు డెంగీ, మలేరియా వ్యాధులతో మంచాన పడితే పట్టించుకునేవారే  లేరని.. ప్రభుత్వం జారీ చేసే జీవోలు వెబ్‌ సైట్‌ లో పెట్టకుండా ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు.

శనివారం ఉమ్మడి  కరీంనగర్  జిల్లా  పర్యటనకు  వచ్చిన  లక్ష్మణ్,  మాజీ  ఎంపీ వివేక్  వెంకటస్వామిని  స్థానిక  నేతలు  ఘనంగా  సన్మానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments