Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా సీఎస్ గా శాంతికుమారి

Webdunia
బుధవారం, 11 జనవరి 2023 (18:49 IST)
Tealangana CS
తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా సీఎస్ గా శాంతికుమారి నియామితులయ్యారు. సీనియర్ ఐఏఎస్ అధికారిణి అయిన ఆమె పేరును తెలంగాణ సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. దీంతో ఆమెను సీఎస్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా ఆమె ఏప్రిల్ 2025 వరకు కొనసాగనున్నారు. 
 
మరోవైపు తనకు సీఎస్ అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ ను ఆమె కలిశారు. ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా శాంతికుమారిని సీఎం కేసీఆర్ అభినందించారు. 
 
1989 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారిణి అయిన శాంతికుమారి.. తెలంగాణకు తొలి సీఎస్ గా చరిత్ర పుటల్లోకి ఎక్కారు. ప్రస్తుతం ఆమె అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. గతంలో ఆమె మెదక్ జిల్లా కలెక్టరుగా బాధ్యతలు నిర్వర్తించారు 

సంబంధిత వార్తలు

శర్వానంద్, కృతి శెట్టి ల మనమే విడుదలకు సిద్దమైంది

వ్యవసాయమే పెళ్లికి అడ్డుగా మారితే తిరుపతి ఏమిచేసాడన్నదే కన్యాకుమారి చిత్రం

అవకాశాలు ఇస్తారని వేచి చూడను, క్రియేట్ చేసుకుంటా: మంచు లక్ష్మి

ప్రభుదేవ, కాజోల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాతో చరణ్ తేజ్ బాలీవుడ్‌లో ఎంట్రీ

టైసన్ నాయుడు కీలక షెడ్యూల్ రాజస్థాన్‌లో ప్రారంభం

ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే

ప్రోటీన్ సప్లిమెంట్లను భర్తీ చేయగల సహజమైన, ప్రోటీన్ అధికంగా కలిగిన ఆహారం

షుగర్ వ్యాధిని అదుపులోకి తెచ్చే పదార్థాలు ఏంటి?

బెల్లం టీ తాగండి.. పొట్ట చుట్టూ కొవ్వును ఇట్టే కరిగించుకోండి..

కిడ్నీలను ఆరోగ్యంగా వుంచుకునే ఆహారం.. ఖాళీ కడుపుతో వెల్లుల్లి..

తర్వాతి కథనం
Show comments