Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీహెచ్ఎంసీ ఆఫీసులో పామును వదిలిన యువకుడు.. ఎందుకో తెలుసా?

Webdunia
బుధవారం, 26 జులై 2023 (15:21 IST)
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలమైపోయింది. అనేక ప్రాంతాల్లో నీరు నిలిచివుంది. ప్రధాన రహదారులన్నీ నీటి మునిగివున్నాయి. ఈ వర్షాల ధాటికి భాగ్యనగరి వాసులు అష్టకష్టాలు పడుతున్నారు. గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో అనేక ప్రాంతాల్లోకి నీరు వచ్చి చేరింది. నేడు, రేపు కూడా అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావారణ కేంద్రం హెచ్చించింది. 
 
పలు ప్రాంతాల్లో మురుగు నీరు ఇళ్లలోకి చేరడంతో పాటు పాములు కూడా వస్తున్నాయి. అల్వార్ పరిధిలో ఓ ఇంట్లోకి పాము రావడంతో ఆ కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్ నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. అయితే, ఫిర్యాదు చేసినా గంటల గంటలు గడిచినా జీహెచ్ఎంసీ అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. 
 
దీంతో ఆ కుటుంబంలోని ఓ యువకుడు తీవ్ర ఆగ్రహాన్ని వెలిబుచ్చుతూ, సదరు పామును పట్టుకుని జీహెచ్ఎంసీ వార్డు ఆఫీసులోకి తెచ్చి వదిలిపెట్టాడు. ఆఫీసులోని టేబుల్‌పై పామును వదిలి నిరసన వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments