Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనగామ చిన్నారి మృతి కేసు.. కన్నతల్లే హంతకురాలు

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2022 (11:59 IST)
జనగామ చిన్నారి మృతి కేసులో కన్నతల్లే హంతకురాలని పోలీసులు తేల్చారు. తనే సంపులో వేసి పాపను హత్య చేసినట్లు తల్లి ఒప్పుకోవడంతో జనగామ చిన్నారి మృతి కేసులో మిస్టరీ వీడింది. పాప ఎదుగుదల లేకపోవడంతో తల్లి ప్రసన్న హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
 
అయితే చిన్నారి తల్లి ప్రసన్న ఘటన జరిగిన తర్వాత స్థానికులకు చెప్పిన కథ మరోలా ఉంది. దీంతో పోలీసులకు అనుమానం రావడంతో, ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. తల్లి ఓ కట్టు కథ అల్లినట్లుగా పోలీసులు గుర్తించారు. 
 
చిన్నారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో తల్లి ప్రసన్న పొంతన లేని సమాధానాలు చెప్పడం పలు అనుమానాలకు తావిచ్చింది. పసికందు సంపులో పడిపోయిందని ఆమె ముందుగా స్థానికులకు చెప్పారు. 
 
కాసేపటికి మాటమార్చి చైన్ స్నాచింగ్‌కు యత్నించిన వ్యక్తి పసికందును సంపులో పడేశాడంటూ చెప్పారు. ప్రసన్న పొంతన లేని జవాబులతో కుటుంబసభ్యులను పోలీసులు విచారించారు. దీంతో తానే చిన్నారిని సంపులో పడేసి చంపినట్లు తల్లి ప్రసన్న పోలీసుల ముందు ఒప్పుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments