Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య... చేస్తుంటే వీడియో తీశారు...

Webdunia
శుక్రవారం, 31 మే 2019 (19:58 IST)
నడిరోడ్డుపై హత్యలు అక్కడక్కడా జరుగుతూనే వున్నాయి. కారణాలు ఏమయితేనే... మానవత్వం నశించి రాక్షసత్వం మేల్కొన్నప్పుడు అలాంటి స్థితిలో తోటి మనిషిని నరికి చంపేస్తుంటారు కొందరు. ఇలాంటి దారుణ ఘటనే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగర శివారులో జరిగింది. పట్టపగలే కత్తులతో ఓ వ్యక్తిని అందరూ చూస్తుండగానే అతి దారుణంగా నరికి చంపారు.
 
సంగారెడ్డి జిల్లా జాతీయ రహదారిపై పటాన్‌చెరు మండలంలోని రుద్రారం వద్ద జాతీయ రహదారిపై వెళుతున్న మహబూబ్‌ అనే వ్యక్తి తనను ఇద్దరు వ్యక్తులు ఫాలో అవడాన్ని గమనించాడు. అంతే... వేగంగా అతడు పారిపోవాలని ప్రయత్నించాడు. కానీ అతడిని ఆ ఇద్దరు వ్యక్తులు తమ బైకులపై వెంబడించి అడ్డుకుని కత్తులతో నరికారు. 
 
అతడు రోడ్డుపై రక్తపు మడుగులో పడిపోగా కసితీరా కత్తులతో నరికి చంపేశారు. ఇదంతా రోడ్డుపై వాహనాల్లో వెళ్తున్నవారు చూస్తూనే వున్నారు. కానీ ఎవ్వరూ ఆ దారుణాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. మహబూబ్ మృతి చెందాడని తెలుసుకున్న తర్వాత హంతకులు ఇద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. ఇదంతా కొందరు వీడియో తీస్తూ వున్నారు తప్పించి ఆ దారుణాన్ని ఆపే సాహసం మాత్రం చేయలేదు. కాగా హతుడు ఓ హత్య కేసులో నిందితుడుగా వున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments