Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య... చేస్తుంటే వీడియో తీశారు...

Webdunia
శుక్రవారం, 31 మే 2019 (19:58 IST)
నడిరోడ్డుపై హత్యలు అక్కడక్కడా జరుగుతూనే వున్నాయి. కారణాలు ఏమయితేనే... మానవత్వం నశించి రాక్షసత్వం మేల్కొన్నప్పుడు అలాంటి స్థితిలో తోటి మనిషిని నరికి చంపేస్తుంటారు కొందరు. ఇలాంటి దారుణ ఘటనే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగర శివారులో జరిగింది. పట్టపగలే కత్తులతో ఓ వ్యక్తిని అందరూ చూస్తుండగానే అతి దారుణంగా నరికి చంపారు.
 
సంగారెడ్డి జిల్లా జాతీయ రహదారిపై పటాన్‌చెరు మండలంలోని రుద్రారం వద్ద జాతీయ రహదారిపై వెళుతున్న మహబూబ్‌ అనే వ్యక్తి తనను ఇద్దరు వ్యక్తులు ఫాలో అవడాన్ని గమనించాడు. అంతే... వేగంగా అతడు పారిపోవాలని ప్రయత్నించాడు. కానీ అతడిని ఆ ఇద్దరు వ్యక్తులు తమ బైకులపై వెంబడించి అడ్డుకుని కత్తులతో నరికారు. 
 
అతడు రోడ్డుపై రక్తపు మడుగులో పడిపోగా కసితీరా కత్తులతో నరికి చంపేశారు. ఇదంతా రోడ్డుపై వాహనాల్లో వెళ్తున్నవారు చూస్తూనే వున్నారు. కానీ ఎవ్వరూ ఆ దారుణాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. మహబూబ్ మృతి చెందాడని తెలుసుకున్న తర్వాత హంతకులు ఇద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. ఇదంతా కొందరు వీడియో తీస్తూ వున్నారు తప్పించి ఆ దారుణాన్ని ఆపే సాహసం మాత్రం చేయలేదు. కాగా హతుడు ఓ హత్య కేసులో నిందితుడుగా వున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments