Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీళ్లు కలపకుండా ఫుల్ బాటిల్ మద్యం తాగాలి.. ఛాలెంజ్ ప్రాణం తీసింది..

Webdunia
శనివారం, 24 అక్టోబరు 2020 (10:57 IST)
సోషల్ మీడియాలో ప్రస్తుతం అనేక ఛాలెంజ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. ఇదే ట్రెండ్ ప్రస్తుతం అన్నీ విషయాల్లో ఆచరిస్తోంది యువత. స్నేహితుల మధ్య చిన్న చిన్న పనులకే ఛాలెంజ్‌లు విసురుకోవడం ప్రస్తుతం ఫ్యాషన్‌గా మారింది. తాజాగా మద్యం చాలెంజ్ ఓ వ్యక్తి నిండు ప్రాణాలను బలి తీసుకుంది. స్నేహితుల మధ్య సరదాగా సాగిన పందెం కాస్త వికటించి విషాదాన్ని నింపింది. 
 
నీళ్లు కలపకుండా ఫుల్ బాటిల్ మద్యం ఒక్కడే తాగడంతో ఓ వ్యక్తి చనిపోయాడు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ శాంతినగర్‌లో చోటుచేసుకుంది. కొంతసేపటికి నోటీ నుంచి నురుగ రావడం మొదలైంది. ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ పరిస్థితి విషమించింది. దీంతో అతడి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. భార్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
 
వివరాల్లోకి వెళితే.. సోమేశ్వరం సాయిలు(40) తన ఐదుగురు స్నేహితులతో కలిసి శివారులో ఉన్న పంట పొలానికి వెళ్లాడు. అందరూ కలిసి పార్టీ చేసుకునేందుకు మద్యం తెచ్చుకున్నారు. భాగా తాగిన తర్వాత మాటా మాటా పెరిగి పందెం వరకు వెళ్లింది. 
 
ఇద్దరు వ్యక్తులు నీళ్లు కలపకుండా ఫుల్ బాటిల్ తాగుతామని పందెం కాశారు. ఆ తర్వాత అంతా ఇంటికి చేరుకోగా.. కొంతసేపటికి సాయిలు నోటీ నుంచి నురుగ రావడం మొదలైంది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. మందు పందెం సంఘటన స్థానికంగా సంచలనం రేపింది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments