Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీళ్లు కలపకుండా ఫుల్ బాటిల్ మద్యం తాగాలి.. ఛాలెంజ్ ప్రాణం తీసింది..

Webdunia
శనివారం, 24 అక్టోబరు 2020 (10:57 IST)
సోషల్ మీడియాలో ప్రస్తుతం అనేక ఛాలెంజ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. ఇదే ట్రెండ్ ప్రస్తుతం అన్నీ విషయాల్లో ఆచరిస్తోంది యువత. స్నేహితుల మధ్య చిన్న చిన్న పనులకే ఛాలెంజ్‌లు విసురుకోవడం ప్రస్తుతం ఫ్యాషన్‌గా మారింది. తాజాగా మద్యం చాలెంజ్ ఓ వ్యక్తి నిండు ప్రాణాలను బలి తీసుకుంది. స్నేహితుల మధ్య సరదాగా సాగిన పందెం కాస్త వికటించి విషాదాన్ని నింపింది. 
 
నీళ్లు కలపకుండా ఫుల్ బాటిల్ మద్యం ఒక్కడే తాగడంతో ఓ వ్యక్తి చనిపోయాడు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ శాంతినగర్‌లో చోటుచేసుకుంది. కొంతసేపటికి నోటీ నుంచి నురుగ రావడం మొదలైంది. ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ పరిస్థితి విషమించింది. దీంతో అతడి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. భార్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
 
వివరాల్లోకి వెళితే.. సోమేశ్వరం సాయిలు(40) తన ఐదుగురు స్నేహితులతో కలిసి శివారులో ఉన్న పంట పొలానికి వెళ్లాడు. అందరూ కలిసి పార్టీ చేసుకునేందుకు మద్యం తెచ్చుకున్నారు. భాగా తాగిన తర్వాత మాటా మాటా పెరిగి పందెం వరకు వెళ్లింది. 
 
ఇద్దరు వ్యక్తులు నీళ్లు కలపకుండా ఫుల్ బాటిల్ తాగుతామని పందెం కాశారు. ఆ తర్వాత అంతా ఇంటికి చేరుకోగా.. కొంతసేపటికి సాయిలు నోటీ నుంచి నురుగ రావడం మొదలైంది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. మందు పందెం సంఘటన స్థానికంగా సంచలనం రేపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments