Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంబులెన్సులో కరోనా బాధితురాలు డెలివరీ

Webdunia
బుధవారం, 29 జులై 2020 (16:36 IST)
కరోనా బారిన పడిన నిండు గర్భిణిని వైద్యం నిమిత్తం 108 వాహనంలో హైదరాబాదు ఆస్పత్రికి తరలిస్తుండగా ఆమె మార్గమధ్యమంలోనే పురుడు పోసుకున్నది. ఈ ఘటన గురించి 108 సిబ్బంది తెలిపిన వివరాల మేరకు, కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌కు చెందిన ఓ మహిళ 9 నెలల నిండు గర్భిణి. కాగా ఆమెకు కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్‍గా నిర్ధారణయ్యింది.
 
దీంతో వైద్యులు ఆ మహిళను డెలివరి కోసం ప్రత్యేక జాగ్రత్త నిమిత్తం హైదరాబాదు తరలించేందుకు నుంగనూరుకు చెందిన 108 సిబ్బందికి ప్రయత్నించారు. ఆంబులెన్స్‌లో తరలిస్తున్న సందర్భంలో మహిళకు మార్గమద్యమంలో పురిటి నొప్పి మొదలయ్యింది. సరిగ్గా మేడ్చల్ శామీర్ పేట వద్దకు చేరుకోగా ఆమెకు పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి.
 
దీంతో 108 సిబ్బంది ఆంబులెన్స్ లోనే ఆమెకు డెలివరి చేయగా ఆమె పండంటి పాపకు జన్మనిచ్చింది. ఆ తర్వాత శిశువు, తల్లిని అదే వాహనంలో హైదరాబాదుకు తరలించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు 108 సిబ్బంది తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments