Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముక్కుపచ్చలారని బాలుడు... పచ్చటి లాన్‌లో ఆడుకుంటూ అనంతలోకాలకు...

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (11:02 IST)
హైదరాబాద్ నగరంలో విద్యుదాఘాతానికి గురైన బాలుడు మృతి చెందిన సంఘటన దిగ్భ్రాంతి కలిగిస్తోంది. వివరాలలోకి వెళ్తే చెన్నైకి చెందిన దివాకర్ భార్యాపిల్లలతో కలిసి పీరంచెరువులోని ఫెబల్ సిటీలో ఈ-బ్లాక్ 8వ నంబర్ ఫ్లాట్‌లో నివాసముంటున్నాడు. ఇతను స్థానికంగా ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. అతని ఏడేళ్ల కుమారుడు మోనీష్ ప్రైవేట్ పాఠశాలలో 1వ తరగతి చదువుకుంటున్నాడు. 
 
ప్రతి రోజూ స్కూల్ అయిపోగానే అపార్ట్‌మెంట్స్ లాన్‌లో తోటి పిల్లలతో ఆడుకునేవాడు. సోమవారం కూడా ఆడుకుంటూ అక్కడ ఉన్న విద్యుత్ స్తంభాన్ని పట్టుకుని అలాగే ఉండిపోయాడు. అప్పటికే స్తంభం కింది భాగంలో కట్ అయిన వైర్ నుండి విద్యుత్ సరఫరా అవుతోంది. పిల్లలు, పెద్దవారు అంతగా గమనించలేదు, ఒక నిమిషం తర్వాత కింద పడిపోవడంతో వెంటనే హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
 
దీంతో అపార్ట్‌మెంట్ వాసులు బాధ్యులైనవారిపై చర్య తీసుకోవాలంటూ ఆందోళనకు దిగారు. మోనీష్ తండ్రి కూడా పోస్టుమార్టానికి తొలుత అంగీకరించలేదు. ఆ తర్వాత దోషులకు శిక్ష పడేలా చేస్తామని హామీ ఇవ్వడంతో అంగీకరించారు. నిర్లక్ష్యం ఖరీదు ఒక నిండు ప్రాణం. అపార్ట్‌మెంట్‌ల కల్చర్ పెరుగుతున్న నేపథ్యంలో కనీస ప్రమాణాలు కూడా పాటించడం లేదని ఇప్పటికే ఎన్నో ఘటనలు నిరూపించినా, పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాకపోవడం బాధాకరం.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments