Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదేశాల నుంచి తండ్రి తెచ్చిన చాక్లెట్.. ఊపిరాడక బాలుడి మృతి

Webdunia
సోమవారం, 28 నవంబరు 2022 (17:35 IST)
తెలంగాణలోని వరంగల్‌‌లో తండ్రి విదేశాల నుంచి తీసుకొచ్చిన చాక్లెట్‌ను తిని ఎనిమిదేళ్ల బాలుడు మృతి చెందాడు. సందీప్ సింగ్ గొంతులో చాక్లెట్ ఇరుక్కుపోయింది. వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. 
 
వివరాల్లోకి వెళితే.. వరంగల్‌లో ఎలక్ట్రికల్ దుకాణం నిర్వహిస్తున్న కంగన్ సింగ్ కుటుంబంలో విషాదం నెలకొంది. కంగన్ సింగ్ తనయుడు సందీప్ సింగ్ గొంతులో చాక్లెట్ ఇరుక్కుపోయింది. వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. 
 
రాజస్థాన్‌కు చెందిన కంగన్‌సింగ్‌ 20 ఏళ్ల క్రితం వరంగల్‌కు చేరుకుని కుటుంబంతో పాటు నలుగురు పిల్లలతో జీవిస్తున్నాడు. అయితే ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన నుంచి తిరిగొచ్చిన కంగర్ సింగ్ తన పిల్లలకు చాక్లెట్లు తీసుకొచ్చాడు. 
 
సందీప్ శనివారం తన పాఠశాలకు కొన్ని చాక్లెట్లు తీసుకెళ్లాడు. రెండో తరగతి విద్యార్థి నోటిలో చాక్లెట్ పెట్టగా అది గొంతులో ఇరుక్కుపోయింది. క్లాసులోనే కుప్పకూలిపోయాడు. ఉపాధ్యాయులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యులు పోరాడినా ఫలితం లేకపోయింది. వైద్యులు రక్షించేందుకు ప్రయత్నించినా సందీప్ ఊపిరాడక మృతి చెందాడు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments