Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొర్రూరు గురుకుల పాఠశాలలో కోవిడ్ కలకలం.. 8మంది విద్యార్థులకు పాజిటివ్

Webdunia
బుధవారం, 19 ఏప్రియల్ 2023 (12:04 IST)
మహబూబా బాద్ జిల్లా తొర్రూరులోని సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 8 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది. పాఠశాలలో మొత్తం 172 మంది విద్యార్థులు వుండగా, 39 మంది సిబ్బందికి ర్యాపిడ్ టెస్టులు చేయగా అందులో 8 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది. 
 
జ్వరంతో బాధపడుతున్న విద్యార్థులను ఆస్పత్రికి తీసుకెళ్లి కరోనా పరీక్షలు చేయించారు. ఇందులో ఒకరికి పాజిటివ్ అని తేలింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది పాఠశాలలో వైద్య శిబిరం నిర్వహించి కరోనా పరీక్షలు చేయించారు.
 
వీరిలో 8 మంది విద్యార్థులకు పాజిటివ్‌ రాగా, వారి ఇళ్లకు పంపించినట్లు ప్రిన్సిపల్‌ జయశ్రీ వెల్లడించారు. మిగిలిన విద్యార్థులను ఓ గదిలో ప్రత్యేకంగా ఉంచామని, విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురికావద్దని సూచించారు

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments