Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో దారుణమైన ఘటన, నిద్రిస్తున్న మహిళను ఎత్తుకెళ్ళి గ్యాంగ్ రేప్

Webdunia
సోమవారం, 27 జనవరి 2020 (18:21 IST)
తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న మహిళను ఎత్తుకెళ్లి ఆమెపై ఏడుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రఘునాథపాలెం మండలానికి చెందిన 35 ఏళ్ల వివాహిత ఇంట్లో నిద్రపోతోంది. నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇద్దరు యువకులు గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోకి ప్రవేశించారు. ఆమె కేకలు వేయకుండా నోరు గట్టిగా అదిమిపెట్టి ఆమెను బలవంతంగా తీసుకుని వెళ్లారు. 
 
మధ్యలో వారితో మరికొందరు యువకులు కలిశారు. ఆమెను అదే మండలంలోని హర్యాతండాలోని పత్తి చేనులోకి తీసుకుని వెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. పక్కింటి వ్యక్తి సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకునేలోపే వారు పరారయ్యారు. 
 
తనపై హర్యాతండాకు చెందిన మోహన్, ఉపేందర్, కల్యాణ్, చంటి, అజ్మీరా నాగేశ్వర రావు, సుకినీ తండాకు చెందిన అశోక్, సునీల్ అత్యాచారానికి పాల్పడినట్లు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్యాచారం జరిగిన స్థలాన్ని పోలీుసులు పరిశీలించారు. నిందితులు అదే ప్రాంతంలో మద్యం తాగినట్లు పోలీసులు గుర్తించారు. 
 
నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బాధితురాలి గ్రామానికి చెందినవారు, బంధువులు రఘునాథపాలెం పోలీస్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం