Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఎస్ఐఎస్‌లో చేరేందుకు వెళ్లిన ముగ్గురు హైదరాబాదీల అరెస్ట్!

Webdunia
శనివారం, 26 డిశెంబరు 2015 (12:14 IST)
ఐఎస్ఐఎస్‌లో చేరే యువకుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోన్న ఐఎస్‌లో చేరేందుకు వెళ్తూ వెళ్తూ శుక్రవారం నాగ్‌పూర్‌లో ముగ్గురు హైదరాబాదీ యువకులు పోలీసులు చిక్కారు. హైదరాబాదు నుంచి శుక్రవారం సాయంత్రానికి రోడ్డు మార్గం మీదుగా నాగపూర్ చేరుకున్న సదరు యువకులు అక్కడి నుంచి జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌కు బయలుదేరేందుకు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) పోలీసులతో కలిసి తెలంగాణ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. 
 
విచారణలో ఆ ముగ్గురు 20 ఏళ్ల వయస్సున్న వారని.. హైదరాబాద్‌కు చెందిన వారని తేలింది. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సదరు యువకులు ఐఎస్ చేరేందుకే ఆఫ్ఘనిస్థాన్ బయలుదేరారు. తమ పిల్లల ఆచూకీ లభించడం లేదని వారి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో క్షణాల్లో రంగంలోకి దిగిన తెలంగాణ పోలీసులు మహారాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేసి నాగపూర్‌లో అదుపులోకి తీసుకున్నారు. 

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments