Webdunia - Bharat's app for daily news and videos

Install App

శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం వజ్రాలు స్వాధీనం

Webdunia
ఆదివారం, 4 అక్టోబరు 2020 (12:52 IST)
హైదరాబాద్ శంషాబాద్‌లో భారీగా బంగారం పట్టుబడింది. దాదాపు 21 కిలోల బంగారంతో పాటు, 30 కోట్ల విలువైన వజ్రాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ముంబైకి తరలించేందుకు స్మగ్లర్లు ప్రయత్నిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. 
 
ముంబైకి తరలించేందుకు స్మగ్లర్ పన్నిన పన్నాగాన్ని పసిగట్టిన కస్టమ్స్ అధికారుల బృందం ఎయిర్ పోర్టులో 5 గంటలుగా విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. భారీ ఎత్తున బంగారం డైమండ్ జ్యువలరీ ఆభరణాలు అక్రమ రవాణా జరుగుతుందని సమాచారం అందడంతో ఎయిర్ కార్గోలో అధికారులను అలర్ట్ చేశారు. 
 
ఆ వెంటనే రంగంలోకి దిగిన కస్టమ్స్ అధికారులు.. డిప్యూటీ కమిషనర్ అధికారుల బృందం పెద్ద ఎత్తున బంగారం, వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. వజ్రా భరణాలు బంగారానికి పైనుండి వెండి పూత పూసి బంగారాన్ని గుర్తుపట్టకుండా అమర్చి తరలిస్తున్నారు స్మగ్లర్లు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments