Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహబూబాబాద్ జిల్లాలో విషాదం..13 ఏళ్ళ బాలిక గుండెపోటుతో మృతి

Webdunia
శనివారం, 1 ఏప్రియల్ 2023 (17:03 IST)
Girl
మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మరిపెడ మండలంలోని అబ్బాయిపాలెం శివారులో బోడతండాకు చెందిన బోడ లక్పతి, వాసంతి దంపతుల ముద్దుల కుమార్తె స్రవంతి (13) శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించింది. 
 
ఓ స్థానిక ప్రైవేట్ స్కూల్‌లో ఆరగ తరగతి చదువుకుంటున్న స్రవంతి, గురువారం శ్రీరామనవమి సందర్భంగా స్కూలుకు సెలవు కావడంతో సాయంత్రం వరకు తండాలో తోటి మిత్రులతో హాయిగా ఆడుకుంది. రాత్రి అమ్మ చేతి గోరుముద్దలు తిని నాన్నమ్మ పక్కలో పడుకుని కథలు చెప్పించుకుని హాయిగా పడుకుంది. 
 
శుక్రవారం తెల్లవారుజామున నిద్రలేచి ఆయాసపడుతూ తల్లితండ్రులను లేపి గుండెలో నొప్పిగా ఉందని చెప్పడంతో వారు అప్పటికప్పుడు గ్రామంలోని ఆర్‌ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళారు. కానీ అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యుడు చెప్పడంతో తల్లితండ్రులు గుండెలు బాదుకొంటూ కన్నీరు మున్నీరుగా విలపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments