Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో కరోనా ఉధృతి.. 13మంది వైద్య కళాశాల విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్

Webdunia
బుధవారం, 24 మార్చి 2021 (20:43 IST)
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. తాజాగా నల్గొండ జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాలలో 13మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది. కోవిడ్ పరీక్షల్లో ముగ్గురికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అప్రమత్తమైన యాజమాన్యం కళాశాలలోని 131 మంది విద్యార్థులకు ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించింది. 
 
ఈ పరీక్షల్లో జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాలలో 13 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయింది. వారిలో మరో 10 మందికి వైరస్‌ సోకినట్లు డీఎంహెచ్‌వో కొండలరావు తెలిపారు. బాధితులను ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు డీఎంహెచ్‌వో చెప్పారు.
 
మరోవైపు కరోనా ఉధృతి నేపథ్యంలో తెలంగాణలో డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న దృష్ట్యా అన్ని యూనివర్సిటీల పరిధిలో ప్రస్తుతం జరుగుతున్న సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు అన్ని విశ్వవిద్యాలయాలకు ఆదేశాలు జారీ చేశారు.
 
మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత పరీక్షలను రీషెడ్యూల్ చేస్తామని పాపిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments