Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం - వైద్యులకు పాజిటివ్

Webdunia
సోమవారం, 17 జనవరి 2022 (18:37 IST)
సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్ పంజా విసిరింది. ముఖ్యంగా, ఈ ఆస్పత్రిలో పని చేసే వైద్యుల్లో అనేక మంది ఈ వైరస్ కోరల్లో చిక్కుకున్నారు. తాజాగా లెక్కల ప్రకారం ఏకంగా 120 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. వీరిలో వైద్యులతో పాటు.. హౌస్ సర్జన్లు, ఎంబీబీఎస్ చదివే విద్యార్థులు కూడా ఉన్నారు. 
 
అదేవిధంగా ఎర్రగడ్డలోని మానసిక చికిత్స వైద్యశాలలో కూడా అనేక మందికి ఈ వైరస్ సోకింది. ఈ మెంటల్ ఆస్పత్రిలో 57 మంది పేషెంట్లు, 9 మంది వైద్యులతో పాటు.. మరికొంతమంది వైద్య సిబ్బందికి కరోనా వైరస్ సోకినట్టు సమాచారం. 
 
అయితే, కరోనా వైరస్ బారినపడుతున్నవారు మానసిక రోగులు కావడంతో ఆస్పత్రి వైద్యులు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుని చికిత్స అందిస్తున్నారు. తెలంగాణాలోని పలు ఆస్పత్రులు, పోలీస్ స్టేషన్లలో పని చేసే సిబ్బంది భారీ సంఖ్యలో కరోనా వైరస్ బారినపడటం ఆందోళన కలిగిస్తుంది. 

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పై రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్ కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments