Webdunia - Bharat's app for daily news and videos

Install App

యేడాది క్రితం తప్పు చేశా.. నా భర్త క్షమించాడు.. పిన్ని వేధిస్తుంది.. అందుకే చనిపోతున్నాం.. దంపతుల Selfie Video

వరుణ్
మంగళవారం, 16 జులై 2024 (11:34 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో ఓ దంపతుల జంట ఆత్మహత్య చేసుకుంది. బంధువులు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేయడంతో తీవ్ర మనస్తాపానికి లోనైన ఆ జంట రైలుకింద పడి ప్రాణాలు తీసుకున్నారు. వీరు ఈ దారుణానికి పాల్పడేముందు... ఓ సెల్ఫీ వీడియోలో తమ ఆవేదనను తెలియజేస్తూ, ఆ వీడియోను పోలీసులకు పంపించారు. ఆ వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ఆ దంపతులను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపు ఆ దంపతులు తనవు చాలించారు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఫకీరాబాద్ - మిట్టాపూర్ మధ్యలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. 
 
పోలీసులు, గ్రామస్థుల కథనం ప్రకారం.. పొతంగల్ మండలం హెగ్జోలికి చెందిన అనిల్ (28), పొతంగల్‌కు చెందిన శైలజ (24)కు ఏడాది క్రితం వివాహమైంది. వారిద్దరూ ఓ ఇంటర్వ్యూకు వెళ్తున్నట్లు కుటుంబీకులకు చెప్పి సోమవారం బయటకు వచ్చారు. అనంతరం తాను ఓ తప్పు చేశానని, దాన్ని భర్త క్షమించినా బంధువులు తమపై దుష్ప్రచారం చేస్తుండడాన్ని తట్టుకోలేక ఇద్దరం గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు శైలజ వీడియో చిత్రీకరించి కోటగిరి ఎస్ఐ సందీప్‌కు పంపారు. 
 
ఆయన నవీపేట ఎస్ఐ యాదగిరి గౌడ్‌కు వీడియోతోపాటు వారి సెల్ఫోన్ నంబరు పంపారు. దంపతులు ఆత్మహత్య చేసుకునేందుకు గోదావరి వద్దకు వస్తున్నట్లు సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు బాసర వంతెన దగ్గరకు వెళ్లి గాలించగా కనిపించలేదు. బాధితుల ఫోన్ నంబరును ట్రాక్ చేయగా ఫకీరాబాద్ - మిట్టాపూర్ మధ్య ఉన్నట్లు నవీపేట ఎస్ఐ గుర్తించి అక్కడికి వెళ్లి గాలించగా ఇద్దరి మృతదేహాలు పట్టాలపై కనిపించాయి. రైల్వే పోలీసులకు సమాచారం అందించినట్లు ఎస్ఐ చెప్పారు.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments