Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తు కాగితాలు సేకరించి జీవించే మహిళపై సామూహిక అత్యాచారం

సెల్వి
సోమవారం, 22 ఏప్రియల్ 2024 (11:49 IST)
చిత్తు కాగితాలు సేకరించి జీవిస్తున్న మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితురాలు మృతి చెందింది. సోమవారం మహిళ మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 
 
సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా ఇద్దరు యువకులు బాధితురాలితో మాట్లాడుతున్నట్లు కనిపించింది. ఈ దారుణానికి పాల్పడిన అనంతరం వారిద్దరూ బైక్‌పై కూకట్‌పల్లి వైపు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు.
 
మూసాపేట వై జంక్షన్ సమీపంలోని వాణిజ్య సముదాయం వద్ద ఆదివారం ఉదయం ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహం పక్కనే చిత్తు కాగితాలతో కూడిన సంచి ఉంది. 
 
మృతదేహంపై బట్టలు చిరిగి వుండటంతో పాటు రక్తస్రావం కావడంతో బాధితురాలిపై అత్యాచారం జరిగినట్లు గుర్తించారు. 
 
ఘటనాస్థలికి సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా.. తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో ఇద్దరు యువకులు బాధితురాలితో మాట్లాడుతున్న దృశ్యాలు కనిపించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్

చిరంజీవిని మీరు నా డెమి-గాడ్.. అంటున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Chiranjeevi 158 - అక్టోబర్ లో చిరంజీవి 158వ చిత్రానికి దర్శకుడు బాబీ శ్రీకారం

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

కన్నప్ప తరువాత వంద కోట్లతో మైక్రో డ్రామాల్ని సృష్టించనున్న విష్ణు మంచు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

తర్వాతి కథనం
Show comments