Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తు కాగితాలు సేకరించి జీవించే మహిళపై సామూహిక అత్యాచారం

సెల్వి
సోమవారం, 22 ఏప్రియల్ 2024 (11:49 IST)
చిత్తు కాగితాలు సేకరించి జీవిస్తున్న మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితురాలు మృతి చెందింది. సోమవారం మహిళ మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 
 
సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా ఇద్దరు యువకులు బాధితురాలితో మాట్లాడుతున్నట్లు కనిపించింది. ఈ దారుణానికి పాల్పడిన అనంతరం వారిద్దరూ బైక్‌పై కూకట్‌పల్లి వైపు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు.
 
మూసాపేట వై జంక్షన్ సమీపంలోని వాణిజ్య సముదాయం వద్ద ఆదివారం ఉదయం ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహం పక్కనే చిత్తు కాగితాలతో కూడిన సంచి ఉంది. 
 
మృతదేహంపై బట్టలు చిరిగి వుండటంతో పాటు రక్తస్రావం కావడంతో బాధితురాలిపై అత్యాచారం జరిగినట్లు గుర్తించారు. 
 
ఘటనాస్థలికి సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా.. తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో ఇద్దరు యువకులు బాధితురాలితో మాట్లాడుతున్న దృశ్యాలు కనిపించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments