Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆత్మహత్యకు యత్నించిన మహిళ.. ప్రాణాలు రక్షించాక మంగళసూత్రం పోయిందని గగ్గోలు (Video)

వరుణ్
సోమవారం, 3 జూన్ 2024 (12:01 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కిన్నెరసాని ప్రాజెక్టులో ఓ మహిళ దూకింది. ఆ సమయంలో అక్కడ ఉన్న కొందరు చూసి, సమయానికి స్పందించడంతో ఆ మహిళ ప్రాణాలు కాపాడగలిగారు. ఈ ఘటన రాష్ట్రంలోని కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని కిన్నెరసాని ప్రాజెక్టు వద్ద చోటు చేసుకుంది. నీళ్లలోకి దూకిన మహిళను గమనించిన టూరిజం సిబ్బంది వెంటనే బోటు ద్వారా ప్రాజెక్టులోకి వెళ్లి ఆ మహిళను కాపాడారు. ఆ మహిళను సురక్షితంగా బోటులోకి ఎక్కించిన తర్వాత... తన మెడలోని మంగళసూత్రం పోయిందంటూ బోరున విలపించసాగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
 
తన భర్త కోరిక మేరకు వారసుడు (సంతానం) ఇవ్వలేని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మొదటి కాన్పులో ఆడబిడ్డే పుట్టింది. రెండో బిడ్డ కూడా ఆడబిడ్డేనని స్కానింగ్ తేలింది. దీంతో అబార్షన్ చేయించుకో అంటూ భర్త, అత్తింటివారి నుంచి వేధింపులు ఎక్కువైపోయాయి. వీటిని తట్టుకోలోని ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
యనమలకుదురుకు చెందిన ఎర్రపోతు కావ్యశ్రీ(19)కి, ఎన్టీఆర్‌ జిల్లా కండ్రికకు చెందిన సందు శ్రీకాంత్‌కు రెండేళ్ల కిందట వివాహం జరిగింది. శ్రీకాంత్‌ పాతపాడు సచివాలయంలో కార్యదర్శి కాగా.. వీరికి 10 నెలల కుమార్తె ఉంది. కావ్యశ్రీ ప్రస్తుతం ఐదు నెలల గర్భిణి. మూడు రోజుల కిందట భర్త ఈమెను విజయవాడలోని ఓ ఆసుపత్రికి తీసుకువెళ్లి స్కానింగ్‌ చేయించగా మళ్లీ ఆడపిల్లని తెలిపారు. 
 
అప్పటి నుంచి భర్త, అత్తింటి వారి వైఖరి పూర్తిగా మారిపోయింది. తమకు వారసుడు కావాలని అబార్షన్‌ చేయించుకోవాలంటూ ఒత్తిడి చేయడం మొదలు పెట్టారు. దీనికి కావ్యశ్రీ ససేమిరా అన్నారు. అయినా వారు వినకుండా అబార్షన్‌ చేయించుకోవాలంటూ రెండుసార్లు బలవంతంగా ఆసుపత్రికి తీసుకెళ్లినా ఈమె అంగీకరించలేదు. ఇలా అత్తింటి వారి వేధింపులు పరాకాష్టకు చేరగా.. అప్పటి నుంచి కావ్యశ్రీ యనమలకుదురులోని పుట్టింటికి వచ్చేసింది.
 
గత నెల 31వ తేదీన భర్త ఈమె వద్దకు వచ్చాడు. ఈ నేపథ్యంలో ఈనెల రెండో తేదీ ఉదయం కావ్యశ్రీ స్నానానికి వెళ్తున్నట్లు భర్తకి తెలిపి బాత్రూముకు వెళ్లింది. ఎంతకూ బయటకు రాకవపోవడంతో భర్త, ఈమె తల్లిదండ్రులు బాత్రూము తలుపులు పగలగొట్టి చూడగా లోపల వెంటిలేటర్‌ రాడ్‌కు చున్నీతో ఉరేసుకొని వేలాడు కనిపించింది. వెంటనే ఈమెను విజయవాడ పటమటలోని ఓ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందింది. 
 
తమ కుమార్తెను భర్త, అత్తింటి వారు అబార్షన్‌ చేయించుకోవాలంటూ ఒత్తిడి చేయడంతోనే బలవన్మరణానికి పాల్పడిందని కావ్యశ్రీ తండ్రి ఎర్రపోతు రాజా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు  భర్త శ్రీకాంత్, అత్త వెంకటేశ్వరమ్మ, మామ లక్ష్మణరావులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసును తాత్కాలికంగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు సీఐ టీవీవీ రామారావు తెలిపారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

35-చిన్న కథ కాదు'- మనందరి కథ : హీరో రానా దగ్గుబాటి

సుహాస్ హీరోగా కోర్టు డ్రామా జనక అయితే గనక.. ఫస్ట్ లుక్

పేక మేడలు సినిమా నుంచి సెకండ్ సింగిల్ ఆడపిల్ల .. విడుదల

వెంకటేష్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ లెంట్ వైఫ్ పాత్రల చుట్టూ తిరిగే కథే వెంకీ మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments