సెల్ఫీ పిచ్చి వద్దు... జీవితాలను నాశనం చేసుకోకండి: సజ్జనార్ సీరియస్

సెల్వి
గురువారం, 4 జులై 2024 (15:44 IST)
మెక్సికోలో సెల్ఫీ మోజుతో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. మెక్సికోలో ఓ యువతి రైలుతో సెల్ఫీ దిగే ప్రయత్నంలో దుర్మరణం చెందింది. మెక్సికోలోని హిడాల్గోలో ఆవిరి ఇంజిన్‌తో నడిచే రైలును చూసేందుకు నిత్యం ఔత్సాహికులు రైలు పట్టాల వద్ద క్యూ కడుతుంటారు. 
 
ఓ యువతి కూడా సెల్ఫీ దిగే క్రమంలో అత్యుత్సాహంతో ప్రాణాలు పోగొట్టుకుంది. సెల్ఫీ బాగా రావాలనే ప్రయత్నంలో ఆమె పట్టాలకు బాగా దగ్గరగా జరిగింది. 
 
ఈ క్రమంలో ఆమెను రైలు ఢీకొట్టడంతో తలభాగంలో తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్ అయ్యింది. దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు. 
 
ఈ ఘటనను పిన్ చేస్తూ సెల్ఫీ పిచ్చి బాగా ముదిరిపోతోందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు. సెల్ఫీల మోజులో పడి ప్రాణాలను సైతం లెక్క చేయడం లేదు.
 
సోషల్ మీడియా పాపులారిటీ మత్తులో పడి.. జీవితాలను నాశనం చేసుకోకండి. అంటూ సజ్జనార్ హితవు పలికారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sarath Kumar: అప్పటికి ఇప్పటికి నాలో ఎలాంటి మార్పు లేదు: శరత్ కుమార్

Sri Vishnu: ఛార్మినార్, ఇరానీ చాయ్ చుట్టూ సాగే కథతో అమీర్‌ లోగ్ ఫస్ట్ లుక్

Vishwak Sen: వినోదాల విందుకి హామీ ఇచ్చేలా విశ్వక్ సేన్.. ఫంకీ టీజర్

Shivaji : ప్రేమకు నమస్కారం లో మహాదేవ నాయుడుగా శివాజి

ఓటీటీలోకి వచ్చిన మారుతి టీం ప్రొడక్ట్ త్రిబాణధారి బార్బరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

తర్వాతి కథనం
Show comments