Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ గ్రూపు-2 పరీక్షలు వాయిదా!

Webdunia
మంగళవారం, 26 డిశెంబరు 2023 (12:34 IST)
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించాల్సిన గ్రూపు-2 పరీక్షలు మళ్లీ వాయిదాపడ్డాయి. చైర్మన్‌తో సహా ఐదుగురు టీఎస్ పీఎస్సీ సభ్యులు రాజీనామాల విషయం ఎటూ తేలకపోవడంతో ఈ పరీక్షల నిర్వహణపై గందరగోళం నెలకొంది. దీంతో ఇపుడు మరోమారు వాయిదాపడ్డాయి. ఇప్పటికే రెండుసార్లు వాయిదాపడిన విషయం తెల్సిందే. 
 
నిజానికి ఈ నెల 6, 7 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించాల్సివుంది. ఈ తేదీలను రెండు నెలల క్రితమే ప్రకటించారు. కానీ, ఈ పరీక్షల నిర్వహణకు మరో వారం పదిరోజుల సమయం మాత్రమే ఉన్నప్పటికీ పరీక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు జరగలేదు. దీంతో ఈ పరీక్షలు వాయిదా వేసినట్టేనని అభ్యర్థులు పేర్కొంటున్నారు.
 
కాగా, రాష్ట్రంలోని వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న 783 పోస్టుల భర్తీకి టీఎస్ పీఎస్సీ గతేడాది డిసెంబరు నెలలో నోటిఫికేషన్ జారీ చేసింది. సుమారు 5.5 లక్షల మంది నిరుద్యోగులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఆగస్టులో పరీక్షలు నిర్వహించనున్నట్లు కమిషన్ తొలుత ప్రకటించింది. ఆపై నవంబరుకు, మళ్లీ 2024 జనవరి నెలకి వాయిదా వేసింది. ఇప్పుడు మళ్లీ వాయిదా పడే అవకాశం ఉండడంతో గ్రూప్ 2 పరీక్షలను రీషెడ్యూల్ చేస్తారా లేక రీవైజ్డ్ నోటిఫికేషన్ జారీ చేస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments