Webdunia - Bharat's app for daily news and videos

Install App

వడగళ్ల వాన, పిడుగులు.. వరంగల్‌లో ఇద్దరు రైతుల మృతి

సెల్వి
సోమవారం, 6 మే 2024 (10:50 IST)
వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో తీవ్ర వేడిమితో అల్లాడుతున్న ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే వడగళ్ల వాన, పిడుగులు ఊహించని నష్టాన్ని మిగిల్చాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఒకే రోజు పిడుగుపాటుకు ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఆదివారం రాత్రి కురిసిన వడగళ్ల వాన ఊహించని నష్టాన్ని మిగిల్చింది. మిర్చి, వరి, బొప్పాయి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 
 
చేతికి అందిన పంట నీటమునిగిందని రైతులు విలపిస్తున్నారు. పంటలను కాపాడుకునే క్రమంలో వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు ఇద్దరు రైతులు మృతి చెందారు.
 
ములుగు జిల్లా ఏటూరు నాగారంలో పిడుగుపాటుకు బుల్లయ్య అనే రైతు మృతి చెందాడు. ఎండు మిరపకాయలు తడవకుండా పాల్టిన్ కవర్‌తో కప్పుతుండగా మరో రైతు పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. 
 
రఘునాథపల్లి మండలం కోడూరు గ్రామంలో దాసరి అజయ్ (25) అనే రైతు పొలంలో పిడుగుపడి మృతి చెందాడు. రైతుతో పాటు ఆవు, దూడ కూడా పిడుగుపాటుకు గురయ్యాయి. 
 
వాజేడు మండలం బొల్లారంలో పిడుగుపాటుకు గుడిసె ధ్వంసమైంది. ఆ గుడిసెలో నివసిస్తున్న కుటుంబం తీవ్ర గాయాలతో బయటపడింది. వీరిని వెంకటాపురం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

కల్కి 2898 AD నుంచి ప్రభాస్, దిల్జిత్ దోసాంజ్ 'భైరవ అంథమ్' రిలీజ్

షో రీల్ తో ఆకట్టుకున్న మిస్టర్ బచ్చన్

అంజలి బహిష్కరణ చేసింది ఎవరిని?

సినిమా రంగంలో సవాళ్లు నేపథ్యంగా ఇట్లు... మీ సినిమా

అనుపమ పరమేశ్వరన్ నటిసున్న పరదా లో దర్శన రాజేంద్రన్ పరిచయం

అసిడిటీ తగ్గించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

తర్వాతి కథనం
Show comments