Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీలక నిర్ణయం తీసుకున్న టీఎస్ ఆర్టీసీ - ఆ తరహా టిక్కెట్ల జారీ నిలిపివేత

Webdunia
ఆదివారం, 31 డిశెంబరు 2023 (12:25 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థ టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్యామిలీ-24, టీ-6 టికెట్ల జారీని నిలిపివేసింది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారు. దీంతో బస్సుల్లో తీవ్రమైన రద్దీ నెలకొంది. పైగా, ఫ్యామిలీ-24, టీ-6 టిక్కెట్ల ప్రయాణం చేసే వారిని గుర్తింపు కార్డులు చూసి వయస్సు నిర్ధారించుకోవాల్సి ఉంది. దీంతో ఆలస్యమైపోతుంది. అంతిమంగా సమయ పాలనపై ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా ఈ రెండు టిక్కెట్ల జారీని నిలిపివేసింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. 
 
జనవరి ఒకటో తేదీ నుంచి ప్రస్తుతం జారీ చేస్తున్న ఫ్యామిలీ-24, టి-6 టికెట్ల జారీని నిలిపివేస్తున్నట్టు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఈ టికెట్లు జారీ చేయాలంటే ప్రయాణికులు తమ గుర్తింపు కార్డును కండక్టర్‌కు చూపించాల్సి ఉంటుంది. వారి వయసును టికెట్‌లో కండక్టర్ నమోదు చేయాల్సి ఉంటుంది. బస్సుల్లో ప్రస్తుతం నెలకొన్న రద్దీ కారణంగా ఈ ప్రక్రియ ఆలస్యమవుతుంది. ఇది అంతిమంగా ప్రయాణ సమయంపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల ప్రయాణికులు అసౌకర్యానికి గురువుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఫ్యామిలీ-24, టీ-6 టిక్కెట్లను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నట్టు సజ్జనార్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments