Webdunia - Bharat's app for daily news and videos

Install App

28 నుంచి తెలంగాణాలో ఇంటర్ పరీక్షలు - నిమిషం ఆలస్యమైనా...

వరుణ్
సోమవారం, 26 ఫిబ్రవరి 2024 (15:29 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 28వ తేదీ బుధవారం నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షల వివరాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి సోమవారం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 1521 సెంటర్లను ఈ పరీక్ష కోసం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 75 ఫ్లయింగ్ స్క్వాడ్, 200 మంది సిట్టింగ్ స్క్వాడ్, 27,900 మంది ఇన్విజిలేటర్లు ఈ పరీక్షల నిర్వహణ విధుల్లో పాల్గొంటారని తెలిపారు. ఇంటర్ ఫస్ట్, ద్వితీయ సంవత్సర పరీక్షలకు మొత్తం 980978 మంది విద్యార్థులు హాజరవుతున్నారని చెప్పారు. 
 
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్ష జరుగుతుందన్నారు. ఈ పరీక్షకు వచ్చే విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా హాల్‌లోకి అనుమతించబోమని చెప్పారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను కోరినట్టు చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. విద్యార్థులు మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకునిరాకూడదని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో నీరు, వైద్య, సదుపాయాలు ఉంటాయని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya 46: వెంకీ అట్లూరితో సూర్య సినిమా.. పూజా కార్యక్రమాలతో ప్రారంభం

బొద్దుగా మారిన పూనమ్ కౌర్... : ఎందుకో తెలుసా?

చిత్రపురిలో రియల్ ఎస్టేట్ ను నియంత్రిచండంటూ సి.ఎం.కు పోరాట సమితి వినతి

Surekha Vani: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సురేఖా వాణి కుమార్తె సుప్రీత

నేను చచ్చేవరకు మోహన్ బాబు గారి అబ్బాయినే : మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments