28 నుంచి తెలంగాణాలో ఇంటర్ పరీక్షలు - నిమిషం ఆలస్యమైనా...

వరుణ్
సోమవారం, 26 ఫిబ్రవరి 2024 (15:29 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 28వ తేదీ బుధవారం నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షల వివరాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి సోమవారం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 1521 సెంటర్లను ఈ పరీక్ష కోసం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 75 ఫ్లయింగ్ స్క్వాడ్, 200 మంది సిట్టింగ్ స్క్వాడ్, 27,900 మంది ఇన్విజిలేటర్లు ఈ పరీక్షల నిర్వహణ విధుల్లో పాల్గొంటారని తెలిపారు. ఇంటర్ ఫస్ట్, ద్వితీయ సంవత్సర పరీక్షలకు మొత్తం 980978 మంది విద్యార్థులు హాజరవుతున్నారని చెప్పారు. 
 
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్ష జరుగుతుందన్నారు. ఈ పరీక్షకు వచ్చే విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా హాల్‌లోకి అనుమతించబోమని చెప్పారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను కోరినట్టు చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. విద్యార్థులు మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకునిరాకూడదని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో నీరు, వైద్య, సదుపాయాలు ఉంటాయని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments