Webdunia - Bharat's app for daily news and videos

Install App

చదివింది ఇంటర్మీడియట్.. కానీ రెండుసార్లు మంత్రిగా...

Webdunia
బుధవారం, 13 డిశెంబరు 2023 (15:34 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకరుగా గడ్డం ప్రసాద్ నామినేషన్ బుధవారం దాఖలు చేశారు. ఆయనకు ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి కూడా మద్దతు ప్రకటించింది. దీంతో ఆయన సభాపతిగా ఎన్నిక లాంఛనం కానుంది. అయితే, గడ్డం ప్రసాద్ చదివింది కేవలం ఇంటర్మీడియట్ మాత్రమే. కానీ, ఆయన దివంగత మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిల మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వికారాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్న తొలి దళిత నేత. అయితే, ఈయన చదివింది ఇంటర్ అయినప్పటికీ రాజకీయంగా పెద్ద ట్రాట్ రికార్డు ఉంది. 
 
రంగారెడ్డి జిల్లా మర్పల్లిలో జన్మించిన ప్రసాద్.. 2008 ఉపఎన్నికల్లో వికారాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తర్వాత వైఎస్ఆర్ మంత్రివర్గంలో పని చేశారు. 2012లో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కొంతకాలం ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2014, 2018 ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఓడిపోయారు. ముగిసిన ఎన్నికల్లో గెలుపొంది, స్పీకర్‌‍గా ఎన్నికకానున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Cannes 2025 : కేన్స్ లో ఎం4ఎం చిత్రం స్క్రీనింగ్, మోహన్, జో శర్మకు రెడ్ కార్పెట్‌ గౌరవం

Pawan: పవన్ గారికి నటనేకాదు వయొలిన్ వాయించడమూ, బుక్ రీడింగ్ తెలుసు : ఎం.ఎం. కీరవాణి

War2 teser: వార్ 2 టీజర్ వచ్చేసింది - రా ఏజెంట్ల మధ్య వార్ అంటూ కథ రిలీవ్

లెగ్దా డిజైన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఆవిష్కరించిన హీరోయిన్ అనన్య నాగళ్ల

Prabhas: ప్రభాస్ తో మారుతీ ప్రేమకథాచిత్రం రీమేక్ చేస్తున్నాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments